Tag:
elephants hulchul in chittoor
చిత్తూరు జిల్లా వి.కోట, పలమనేరు నియోజకవర్గములోని వి.కోట మండలంలో 14 ఏనుగుల గుంపు హల్చల్. నిన్న రాత్రి సుమారు 7 గంటల నుంచి పంట పొలాలపై స్వైర విహారం చేసిన ఏనుగుల గుంపు. ఉదయం తిరిగి అడవిలోకి వెళ్లిన ఏనుగులు. అటవీశాఖ అధికారులు ఏనుగుల మందను తరిమే ప్రయత్నంలో విఫలం అయ్యారు. గత రెండు రోజులుగా పంట పొలాలను తొక్కి ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు. పలు గ్రామాల్లో అరటి,రాగి,టమోటా పంటలు పూర్తిగా ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు. వి.కోట మండలం వెర్రినాగేపల్లి గ్రామంలో వరి..అరటి..బీన్స్..మామిడి..తోటలపై ఏనుగులు దాడి సుమారు పది లక్షల ఆస్తి నష్టం. ఫారెస్ట్ అధికారులు స్పందించడం లేదని రైతుల ఆందోళన.





Total views : 62199