వైఎస్సార్సీపీ అధ్యక్షుడు(YSRCP President), ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర(Bus Yatra) ఇవాళ్టి షెడ్యూల్(Schedule) ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ విశాఖలోని ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇది చదవండి: ఎంతమందితో పొత్తులు పెట్టుకున్న గెలిచేది జగనే..!
అక్కడ నుంచి తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బొద్దవలస మీదుగా సాయంత్రం మూడున్నర గంటలకు గంటలకు చెల్లూరు వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తర్వాత చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారని రఘురాం తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటనఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఏడో రోజున సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పరివర్తన, పౌర సేవల్లో సాంకేతికత వినియోగంపై మంత్రుల బృందం సమగ్ర అధ్యయనం చేసింది. సింగపూర్…
- విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయులు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,…
- గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రోజు రోజుకీ తీవ్రమవుతోంది. నదులు, వాగులు సహజసిద్ధంగా ఉండాల్సిన చోట రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, లారీలు విరుచుకుపడుతూ ఇసుకను తరలిస్తున్నాయి. ఈ దోపిడీ వల్ల పర్యావరణ సమతుల్యతకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతోంది.…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 56953