పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో రెండో రోజు పల్లె నిద్ర కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు, వైఎపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా గుడిపూడిలో ఇంటింటి ప్రచారం చేశారు. స్ధానికులు, ముఖ్య నేతలతో సహపంక్తి భోజనాలు చేసారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విరుచుకుపడ్డారు, పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ సీఎం, సీఎం అని అంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం, చంద్రబాబు సీఎం అంటున్నారన్నారు, పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు తెలియవని, అతను రాజకీయాలకు పనికిరాడని అతను నమ్మి వెళితే కుక్కతోక పట్టుకొని గోదారి వీధినట్టేనని అంబటి విమర్శించారు, సంక్షేమ కార్యక్రమాలు అమలు కోసం జగన్ మళ్లి సీఎం కావలన్నారు.
Janasena
పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డ మంత్రి అంబటి…పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ సీఎం,సీఎం అని అంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం, చంద్రబాబు సీఎం అంటున్నాడు. ఎందుకంటే పవన్ కి క్యాష్ కొడితే వెళ్ళిపోతాడు.పవన్ కళ్యాణ్కు రాజకీయాలు తెలియవు. అతను రాజకీయాలకు పనికిరాడు. అతను నమ్మి వెళితే కుక్కతోక పట్టుకొని గోదారి వీధినట్టే… జగనే ఎందుకు మళ్ళీ సీఎం కావాలంటే,
సంక్షేమ కార్యక్రమాలు అమలు కోసం జగన్ రావాలన్నారు
పల్నాడు జిల్లా… రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో పవన్ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి రాంబాబు. పవన్ కళ్యాణ్ పై అంబటి ఘాటు కామెంట్స్ మా వాళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ సూట్ కేసులు క్యాష్ తీసుకొని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేసే నీచమైనటువంటి రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వచ్చిన వారిని మళ్ళా ఇంటికి పంపిస్తారు ఈ రాష్ట్ర ప్రజానీకం. పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజెపికి సపోర్ట్ చేస్తారంట. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో జెండా ఎత్తేశారు. పవన్ అక్కడ భారతీయ జనతా పార్టీ మోడీకి, ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారు. అక్కడ అలా ఇక్కడ ఇలా ఏమిటో ఎవరికి అర్థం కాదు. ఏప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్. కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులను ఎన్టీ రామారావు పవన్ కళ్యాణ్ చెప్పారు. నావల్ల నా ప్రభుత్వం వల్ల మేలు జరిగితే ఓటెయ్యండి.
అని అడిగిన మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఇంటికి ద్రోహం చేసిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు. ఉద్యోగాలు ఇస్తానని, ఋణ మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. వైసీపీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి దార్శనియంగా ఉన్నాయన్నారు. అందరూ సమిష్టిగా పనిచేసి జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు మంత్రి అంబటి.
జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కామెంట్స్గత సంవత్సరం నవంబర్ 2 వ తరికున పత్రిక సమావేశం ఏర్పాటు చేసి చెప్పాము మహిళ సాధికారత కోసం ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది అని చెప్పింది అది మోసం అని ఆనాడే చెప్పడం జరిగింది. జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో పెద్ద మోసం జరిగింది ఆనాడే చెప్పాము అది జగనన్న పాల వెల్లువ కాదు పాపాల వెల్లువ అని 2,955 కోట్లు కోట్లు ఈ కార్యక్రమానికి ఖర్చు చేశామని చెప్తున్నారు ఎన్ని పశువులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 8 వేలు మాత్రమే మీరు కొనుగోలు చేసింది ఈ స్కీం అంత సెర్ఫ్ ద్వారానే అమలు అవుతుంది ఇప్పటి వరకు ఏ బ్యాంక్ ఎంత అప్పు ఇచ్చింది అంటే లెక్కలు చూపించరు 15 లక్ష ల 76 వేలు లీటర్ల పాలు రావాలి మీరు కొనుగోలు చేసిన పాడి పశువులు ప్రకారం ఐతే 2 లక్షల లీటర్ లు వచ్చినవి అని ప్రభుత్వం చెబుత్వం సరైన లబ్దిదారులు లేకుండా బ్యాంకులు ఏ విధం గా రుణాలు ఇచ్చాయి దీనిపై బ్యాంక్ కూడా ఋణాలు ఇచ్చారు. కాబట్టి సీబీఐ ఏంక్విరీ వెయ్యాలి జనసేన పార్టీ ఛాలెంజ్ చేస్తుంది ఏ జిల్లా ఐనా మంత్రి గారినే ఎంపిక చెయ్యమనండి వారి తో మేము వస్తాం ఎన్ని పశువులు ఉన్నాయో చూపించండి నవంబర్ 14 తరువాత ఏ శాఖ లో ఎంత అవినీతి జరిగింది ప్రతి ఒక్కరికి వివరించే విధంగా రోజుకు ఒక స్కామ్ గురించి చెపుతాము. 2216 కోట్లు బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారు లబ్ధిదారులను ఏ ప్రతిపాదికన ఎంపిక చేసారు. 737 కోట్లు సబ్సిడీ అన్నారు ఎంత మందికి సబ్సిడీ ఇచ్చారు. ప్రభుత్వమే ఒప్పుకుంది పశువుల రీసైక్లింగ్ చేసాము అని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో ఇంత పెద్ద స్కామ్ జరిగింది ఈ ప్రోగ్రాం లో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజా సమస్యల పై మాట్లాడతారు
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్నటి రోజు ధర్మవరంలో వైసీపీ నాయకులు చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర గురించి మాట్లాడుతు వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు చేపడుతున్న యాత్ర సామాజిక సాధికార బస్సు యాత్ర కాదని అది కేవలం జగన్ రెడ్డి భజన యాత్రని కమ్మ కులస్తులను విమర్శించేందుకే ధర్మవరంలో ఈ బస్సు యాత్ర పెట్టారని కులాన్ని పెట్టి విమర్శించడం హేయమైన చర్యని అలాగే సామాజిక న్యాయం అంటే బీసీలను,మైనార్టీలను పీకి ఓసి మంత్రులకు ఇవ్వడమే సామాజిక న్యాయం అంటారా అంటూ బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ వారి యొక్క దొంగ యాత్రను గమనిస్తున్నారని 2024లో వారికి కచ్చితంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న వేల వరికపూడి శాలా శంకుస్థాపన చేస్తారని చెప్పడం చాలా హస్యాద్పదంగా ఉందని ఆరోపించారు. వరికపూడి సాల ప్రాజెక్ట్ పూర్తి చేసేది జనసేన టిడిపి ప్రభుత్వమే . పల్నాడు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కడం తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. మాచర్ల పట్టణంలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. 2024 ఎలక్షన్ తర్వాత వైసీపీ పార్టీ భూస్థాపితం ఖాయం అని అరోపించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులి హరి మాచర్ల మండల అధ్యక్షుడు జి సాంబశివరావు వెల్దుర్తి అధ్యక్షుడు గంధం మల్లయ్య మరియు లాల్ కృష్ణ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Read Also..
టిడిపి, బిజెపి, జనసేన పొత్తుల విషయం అధినాయకత్వం చూసుకుంటుందని, ఎన్నికల రెండు నెలల ముందు పొత్తులపై నిర్ణయం కేంద్రంలోని పెద్దలు తీసుకుంటుంటారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. శుక్రవారం స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ని ఆమే దర్శించుకున్నారు. ఆలయ మర్యాదులతో స్వాగతం పలికి స్వామి వారి దర్శిన బాగ్యం కల్పించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపట్టాన్ని అందజేసిన ఆలయ ఈవో వెంకటేశు. తరువాత అగరంపల్లిలో బిజెపి కార్యాలయం ను ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలను కొనసాగుతుందని ఎదిరించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా…లిక్కర్, ఇసుక, మైనింగ్ లతో అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. బిజెపి లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానం చెప్పలేక అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబు నాయుడుపైన కేసులు పెడుతున్నారన్నారు పురందేశ్వరి. రాష్ట్రంలో నిరంకుశత పాలన నడుస్తోందని మండిపడ్డారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరుల మీద కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంపై తాము లేవనెత్తిన ప్రశ్నలు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాబోయే ఎన్నికలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ అంశంపై అగ్రనాయకులు చూసుకుంటారని తెలిపారు. మిగిలిన పొత్తులు సాధారణంగా ఎన్నికలు రెండు నెలలు ముందు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ట్రాక్టర్లు పెద్దపెద్ద జేసీపీలతో నదుల్లో ఇసుక మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నిజమైన సామాజిక న్యాయం చేస్తున్నది ప్రజలకు సబకే సత్, సబ్కె వికాస్ ముందుకెళ్తున్నామని పురందేశ్వరి పేర్కొన్నారు.
తెలంగాణలో జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. 12 నియోజకవర్గాలలో జనసేన పొటీ చేయనున్నది. 9 నియోజకవర్గాలపై అవగాహన కుదిరింది. మరో 3 నియోజకవర్గాలపై చర్చలు జరుగుతున్నాయి. జనసేనకు కూకట్ పల్లి ,శేరిలింగంపల్లి , వైరా, ఖమ్మం, అశ్వరావుపేట , కొత్తగూడెం, కోదాడ,నాగర్ కర్నూల్ , తాండూర్ నియోజకవర్గాలను బీజేపీ కేటాయించింది.
టిడిపి జనసేన ఆత్మీయ సమ్మేళనాలు జిల్లాల వారీగా మూడు రోజులు పాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆత్మీయ సమ్మేళనం కాకినాడలో జరిగింది. తెలుగుదేశం పార్టీ తరపున ప్రతినిధిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తామని జగన్ కు తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా రవీంద్ర పేర్కొన్నారు. జగన్ అనే వైరస్ కు జనసేన, టిడిపి సరైన వ్యాక్సిన్ అని చెబుతున్న రవీంద్ర తో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్.





Total views : 89828