కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్రదుర్గం జిల్లా తుమకుర్లహళ్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఢీకొన్న ప్రభావంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tag:






Total views : 89056