డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కంచిలి మండలం మకరాంపురం చేరుకుంటారు, అక్కడ డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభిస్తారు, ఆ తర్వాత పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు, అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
kidney research center
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో సిఏం జగన్ పర్యటించనున్నారు. ఏళ్ల తరబడి కిడ్ని వ్యాదుల భారిన పడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజల కోసం తలపెట్టిన రెండు కీలక ప్రోజేక్ట్ లు ప్రారంభానికి సిద్దమయ్యాయి. దీనిని సిఏం జగన్ 14 వ తేదిన ప్రారంభించనున్నారు. 14వ తేదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచిలి మండలం మఖరాంపురం గ్రామానికి రానున్నారు. అక్కడ జాతీయ రహదారి పక్కన నిర్మించిన వైఎస్సార్ సుజల ధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను పరిశీలించనున్నారు. జలజీవన్ మిషన్ లో భాగంగా 700 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధులు తీవ్రంగా ఉన్న ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం, మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లోని 807 గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించనున్నారు.
మఖరాంపురం గ్రామము నుండి హెలికాప్టర్ లో పలాస చేరుకోని కిడ్ని రిసెర్చ్ సెంటర్ ని ప్రారంభించనున్నారు జగన్. ఏపీ సర్కార్ కిడ్నీ వ్యాధులతో ఇక్కట్లు పడుతున్న వేలాది మందికి ఉపయోగపడేలా 74.24 కోట్లతో కిడ్ని రిసెర్చ్ సెంటర్ ని నిర్మించింది. వీటితో పాటు APIIC ఆద్వర్యంలో అరవై ఏకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్ కు, ఆంద్రాయూనివర్శిటి అనుబంద విభాగానికి సిఏం జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. అక్కడ నుండి పలాసలో రోడ్ షో నిర్వహించి అనంతంరం పలాస రైల్వే గ్రౌండ్ లో నిర్వహించే భహిరంగ సభలో జగన్ పాల్గోనున్నారు.
Read Also…
Read Also…
శ్రీకాకుళం జిల్లాలో గతవారం జరగవలసిన ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని, డిసెంబర్ 12 న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు రానున్నారని రాష్ట్ర మంత్రి సీధిరి అప్పలరాజు తెలిపారు. పలాసలో మీడియా తో మాట్లాడుతూ ఉద్ధానం ప్రాంతానికి దశాబ్దాల కాలంగా పీడిస్తున్న కిడ్నీ వ్యాధి ని శాశ్వతంగా నిర్మూలించేందుకు 720 కోట్లతో ప్రతీ గ్రామం లో ఏర్పాటు చేసిన శుద్ధ జలాల మంచినీటి పథకాన్ని మరియు పలాస లో కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని సిఎం చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని మంత్రి అప్పలరాజు తెలిపారు. ప్రభుత్వం నిర్మిస్తున్న వీటిని ప్రజలు సందర్శించేందుకు అనువుగా రెండు బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.





Total views : 147270