కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రజాపాలన పేరిట ఈ హామీల అమలుకు చర్యలు చేపట్టింది. తాజాగా, ప్రజాపాలన హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తారు.
Tag:
Ministers Sridhar Babu
తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. శీతాకాల విడిది నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భూదాన్ పోచంపల్లిని కూడా సందర్శించారు. నిన్న రాత్రి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్హోమ్’ కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ ఉదయం హకీంపేట్లో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అధికారులు వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీకి పయనమయ్యారు.
Read Also..
Read Also..