భారత దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా 3000 పెన్షన్ ఇచ్చే రాష్ట్రం లేదని, సిఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నట్లు శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష ఆధ్వర్యంలో పెన్షన్ పెంపు కార్యకరమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తో పాటు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషా పీఎస్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలోఇచ్చిన హామీలన్నింటిని వంద శాతం నెరవేర్చిన ఘనత సిఎం జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. గతంలో పెద్దాయన పరిపాలనాలో ప్రస్తుతం ఆయన ప్రతి పక్షంలో ఉన్నాడు. గత ప్రభుత్వ హయాంలో 70 సంవత్సరాలు వచ్చిన వారికి పెన్షన్ అందించే వారు. కొత్త పెన్షన్ ఎవరికైనా రావాలంటే ప్రస్తుతం ఉన్న పెన్షన్ దారుడు మరణిస్తే కానీ మంజూరు అయ్యే పరిస్థితులు ఉండేవి కాదన్నది మనందరికీ తెలిసిన విషయమేమన్నారు. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హతే ఆదరంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు వందల రూపాయలు పెన్షన్ అందించారన్నారు. రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ ను తన తనయుడు ఈ రోజు 3000 లు చేసిన గొప్ప మనసున్న నాయకుడమ్మ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. జగన్ అన్ని రాష్ట్రాలలో కంటే ఎపిలో భిన్నమైన పాలనను ప్రజలకు అందిస్తున్నారన్నారు. ఐదు లక్షలు నున్న వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ని 25 లక్షలకు పెంచి పేదలకు అండగా నేనున్నానని సీఎం జగన్ భరోసా కల్పించారన్నారు. అనంతరం వారు లబ్దిదారులకు పెంచిన రూ 3000 పెన్షన్ లను అందజేశారు. మరణించిన మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు రెండు లక్షలు రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కౌన్సలర్లు, వైకాప నాయకులు,మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున వారి సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వాలింటర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు.
MLA Gadikota Srikanth Reddy
వైద్యం కోసం వచ్చే ప్రతి సామాన్యుడికి అన్ని రకాల మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే ఈ వంద పడకల ఆసుపత్రి ప్రధాన లక్ష్యమని శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లో సుమారు 23 కోట్లతో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ లు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారికీ ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష, ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్, అన్నమయ్య జిల్లా డి ఎం హెచ్వో కొండయ్య, ప్రాంతీయ వైద్యశాల సూపరిటెండెంట్ డేవిడ్ సుకుమార్, ప్రముఖ సీనియర్ వైద్యులు బయా రెడ్డి, నారాయణ రెడ్డి లతో పాటు ఇతర ముఖ్యమైన అధికారులు, వైకాప నాయకులతో కలిసి ఆసుపత్రి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ నుండి వేద మంత్రాలు, మేళ తాళాల నడుమ పూర్ణ కుంభం తో ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్దకు చేరుకొని జ్యోతి ప్రజ్వలన గావించారు. ఆసుపత్రి లో వివధ రకాల వైద్య సేవలందించే గదులను ప్రారంభించి వైద్యం కోసం వచ్చే రోగులకు సంబంధించిన వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ దినం చాల చారిత్రాత్మక దినం అన్నారు. వందపడకల ఆసుపత్రి రోగులకు అందుబాటులోకి రావడంతో రాయచోటి ప్రజల చిరకాల కోరిక నేటితో నేరవేరిందన్నారు. ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి మొట్ట మొదటి సారిగా రాయచోటిలో పర్యటించినప్పుడు వందపడకల ఆసుపత్రి నిర్మాణం కొరకు శంకు స్థాపన చేశారన్నారు. అయితే కరోనా కారణంగా ఆలస్యం అయ్యిందన్న శ్రీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పాటు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ ల సహకారంతో త్వరిత గతిన నిర్మాణాలను పూర్తీ చేసుకొని ఈ రోజు అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే సిటి స్కాన్, 8 బెడ్లు ఉన్న డయాలసిస్ ను 20 బెడ్లకు పెంచే విధంగా కృషి చేస్తామన్నారు.
ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పార్టీ మారుతున్నాడని పలు సామాజిక మాధ్యమాలలో వచ్చిన కథనాలకు రాయచోటి ఎంపిడివో సభా భవనంలో మీడియా ద్వారా వైకాప సీనియర్ నాయకులు, మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. మా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పదవులను సైతం పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజంగా నిలిచారు. ప్రజల శ్రేయస్సు కోసం, రాయచోటి అభివృద్ధి కి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు తోడు నిలిచిన ఏకైక నాయకుడు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. వైఎస్సార్ కుటుంబ కోసం పదవులను సైతం వదులుకున్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పై అసత్య ఆరోపణ కథనాలు ప్రచురించడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. రాయచోటి అభివృద్ధి కోసం ఆహార్నిశలు కృషి చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి ని రాజకీయంగా ఎదుర్కోలేకనే కొంత మంది కుట్రలతో ఇటువంటి కథనాలను ప్రచారం చేస్తున్నారు.




Total views : 75276