ఉత్తరాఖండ్లో నిర్మాణంలో ఉన్న ఓ భారీ టన్నెల్ కొంత భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో 40 మంది వరకు కార్మికులు చిక్కుకున్నారు. ఉత్తరకాశీలో సిల్క్యారా నుచి దండల్గావ్కు మధ్య ఈ టన్నెల్ ఉంది. చార్ధామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా 4 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. ఉత్తరకాశీ నుంచి యమునోత్రి ధామ్ వరకు 26 కిలోమీటర్ల ప్రయాణాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్ అందించేందుకు ఓ పైప్ను ఏర్పాటు చేసి, వారందరినీ రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సొరంగం తెరవాలంటే దాదాపు 200 మీటర్ల శ్లాబ్ను తొలగించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సొరంగంలో ఆక్సిజన్ పైపును పంపించడానికి, చిక్కుకుపోయిన కార్మికులకు సహాయం చేయడానికి ఇరుకైన మార్గాన్ని తవ్వారు.
project
నాగర్ కర్నూల్ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశానని మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి పరుస్తానని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ అణిచివేతకు గురైందని ప్రత్యేక తెలంగాణ సాధన తో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సర్వతోముఖాభివృద్ధి సాధించాడని అన్నారు. నాగర్ కర్నూల్ లో కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా సగునీరు అందించడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు బీజం వేసి పూర్తిచేసే దశకు చేరుకుందన్నారు. పాలమూరు రంగారెడ్డి తో తెలంగాణ సస్యశ్యామలమవుతుందని అన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే చిత్తశుద్ధితో ప్రజా శ్రేయస్సు కై పనిచేస్తానని అన్నారు. విద్య వైద్య వ్యవసాయ రంగాలలో ఎంతో ప్రగతి సాధించామని ఉన్నత కళాశాలలు నెలకొల్పడం జరిగిందని అన్నారు.






Total views : 75477