Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Andhra Pradesh రంగారెడ్డి ప్రాజెక్టుకు పూర్తిచేసే దశ..

రంగారెడ్డి ప్రాజెక్టుకు పూర్తిచేసే దశ..

by Satya
Janardhan Reddy

నాగర్ కర్నూల్ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశానని మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి పరుస్తానని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ అణిచివేతకు గురైందని ప్రత్యేక తెలంగాణ సాధన తో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సర్వతోముఖాభివృద్ధి సాధించాడని అన్నారు. నాగర్ కర్నూల్ లో కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా సగునీరు అందించడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు బీజం వేసి పూర్తిచేసే దశకు చేరుకుందన్నారు. పాలమూరు రంగారెడ్డి తో తెలంగాణ సస్యశ్యామలమవుతుందని అన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే చిత్తశుద్ధితో ప్రజా శ్రేయస్సు కై పనిచేస్తానని అన్నారు. విద్య వైద్య వ్యవసాయ రంగాలలో ఎంతో ప్రగతి సాధించామని ఉన్నత కళాశాలలు నెలకొల్పడం జరిగిందని అన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: