నాగర్ కర్నూల్ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశానని మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి పరుస్తానని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ అణిచివేతకు గురైందని ప్రత్యేక తెలంగాణ సాధన తో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సర్వతోముఖాభివృద్ధి సాధించాడని అన్నారు. నాగర్ కర్నూల్ లో కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా సగునీరు అందించడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు బీజం వేసి పూర్తిచేసే దశకు చేరుకుందన్నారు. పాలమూరు రంగారెడ్డి తో తెలంగాణ సస్యశ్యామలమవుతుందని అన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే చిత్తశుద్ధితో ప్రజా శ్రేయస్సు కై పనిచేస్తానని అన్నారు. విద్య వైద్య వ్యవసాయ రంగాలలో ఎంతో ప్రగతి సాధించామని ఉన్నత కళాశాలలు నెలకొల్పడం జరిగిందని అన్నారు.
Education
ప్రజల్లో ఓటు పట్ల అవగాహన కల్పించి ప్రధాన రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పేందుకు తమకున్న రిజర్వేషన్ స్థానాల్లో కాకుండా జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంబోత్ రాంబాబు స్పష్టం చేశారు. ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో తమ జీవన స్థితిగతుల్లో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా 60 స్థానాల్లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని పేర్కొన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ సంక్షేమాన్ని విస్మరించాయని ఆరోపించారు. రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాల పై పెట్టిన శ్రద్ద విద్య , వైద్యం , ఉపాధి అంశాలపై పెట్టలేదని విమర్శించారు. అధికార బిఆర్ఎస్ పార్టీ తమకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కులను కలరాస్తుందని మండిపడ్డారు. తాము ఈ పోటీలో గెలవకపోయిన తమను విస్మరించిన వారిని ఓడిస్తామని ఆయన హెచ్చరించారు.






Total views : 75478