విజయవాడ, డీఆర్ఎం విజయవాడ రైల్వే డివిజన్ గోదావరి ఎక్స్ప్రెస్ కు 50 సంవత్సరాలు నిండటంతో రాత్రికి 11గంటలకు గోదావరి ఎక్స్ప్రెస్ వద్ద సంబరాలు. గోదావరి ఎక్సప్రెస్ వెళ్ళే అన్ని ప్రధాన స్టేషన్లలో సంబరాలు. గోదావరి ఎక్సప్రెస్ ఒక సెంటిమెంట్ కొందరు ప్యాసింజర్లకు విజయవాడ మధురానగర్ అండర్ పాస్ కు అప్రోచ్ రోడ్డు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాల్సి ఉంది. నాలుగు లైన్లను అభివృద్ధి చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఏపీకి గణనీయమైన రైల్వే బడ్జెట్ ను ఈ సారి ఏర్పాటు చేసింది కేంద్రం.
Railway
ఉత్తరాదిన మంచు ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నుంచి శబరిమల వెళ్లేందుకు అయ్యప్ప స్వాములు గంటల తరబడి స్టేషన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తెల్లవారింది మొదలు పట్టణ, గ్రామీణ ప్రాంతాలు పొగమంచు తో కమ్ముకుంటున్నాయి. దీంతో రాకపోకలు సన్నగిల్లుతున్నాయి.
న్యూఢిల్లీ నుండి దక్షిణాది రాష్ట్రాలైన హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒక్కో ట్రైన్ 10 నుండి 26 గంటల ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వే అధికారులు ప్రత్యామ్నాయంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.