ధరణి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సచివాలయంలో అధికారులతో ధరణిపై సమీక్ష నిర్వహించారు. ధరణిపై సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భూముల సర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకు రావడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.83 కోట్లు ఇచ్చింది. ఆ నిధులు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. నిషేధిత భూముల జాబితా, అసైన్డ్ భూముల వివరాలతో పాటు మంత్రులు లేవనెత్తిన అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్ మిట్టల్ను ఆదేశించారు.
Tag:
revenue
తెలుగు రాష్ట్రాల్లో రెవిన్యూ అధికారుల చేతివాటం మామూలుగా ఉండదు. శ్రీకాకుళం జిల్లాలో రెవిన్యూ అధికారుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. జీ సిగడం మండలంలోని రెవెన్యూ అధికారులు…ముడుపులు లేనిదే ఎటువంటి పనులు చేయడం లేదు. సంతవూరిటీ గ్రామానికి చెందిన సీతాలక్ష్మి … తన అత్తమామల ఆస్తులను కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు. అయితే అదే కుటుంబానికి చెందిన కొంతమంది… ఎమ్మార్వో కు లంచం ఇచ్చి… వీలునామా చేసుకుని 1 బి అడంగల్ లో … తమపేర్లు ఉండే విధంగా చేసుకున్నారు. అయితే… ఆ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉంటే.. వారి పేరు మీద వన్ బి ఆడంగల్ ఎలా వచ్చిందని సీతాలక్ష్మి ప్రశ్నిస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళ సీతాలక్ష్మి కోరుతోంది.





Total views : 147571