కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, మొవ్వ (మ) కూచిపూడి లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గొట్టిపాటి సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 బాల, బాలికల కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. ఈ నెల 11 నుంచి 13 వరకు కబడ్డీ పోటీలు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి 13 టీములు పాల్గొనున్నాయి. లక్ష రూపాయలు వరకు నగదు బహుమతి ఉంటుంది అని కన్వీనర్ గొట్టిపాటి సాయి అన్నారు. గెలిచిన వారికి సినీ హీరో సంపూర్ణేష్ బాబు చే బహుమతుల ప్రధానోత్సవం చేయడం జరుగుతుంది అని అన్నారు.
Tag:
sankranthi
ఐ పోలవరం మండలం మురమళ్ళ స్థానిక శ్రీ సాయి స్కూల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్కూల్ చైర్మన్ వాసురాజు దంపతులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కనుమరుగైపోతున్న సంక్రాంతి సాంప్రదాయాలు ఈతరం విద్యార్థిని విద్యార్థులకు కళ్ళకి కట్టినట్టుగా నిర్వహించారు. స్కూల్ ఆవరణలో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటల విన్యాసాలు, తెలుగింటి వస్త్రధారణలు, రంగురంగుల రంగవల్లులు, కోడిపందాల కార్యక్రమాలు నిర్వహించారు. భోగిమంటల చుట్టు పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరిగాయి.