హైదరాబాద్, డిసెంబర్ 14న రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా దినసరి అనసూయ సీతక్క నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి లతోపాటు పలువురు ఎమ్మెల్యేలు పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్ హనుమంత రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్ వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.
sports
హైదరాబాద్, డిసెంబర్ 14న రాష్ట్ర సమాచార, రెవిన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలు నాయక్, ఆది శ్రీనివాస్, యశస్వినీ రెడ్డి తోపాటు పలువురు సీనియర్ నాయకులు రేణుకా చౌదరి, రామసహాయం సురేందర్ రెడ్డి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ కె. అశోక్ రెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జేడీ లు జగన్, శ్రీనివాస్, వెంకట రమణ, డీడీ లు మధు సూధన్, హాష్మి, రాజా రెడ్డి, సీఐఈ రాధా కిషన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. భువనగిరిలో స్పోర్ట్ కాంప్లెక్స్ కు 10 ఎకరాల భూమి భువనగిరి జిల్లా రాయగిరి లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి పది ఎకరాల భూమిని కేటాయిస్తూ తన మొదటి ఫెయిల్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతకం చేశారు. రూ. 9.50 కోట్ల విలువ గల ఈ పదెకరాల స్థలాన్ని మల్టి పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి చేపట్టేందుకు యువజన, క్రీడల శాఖకు కేటాయించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల డీపిఆర్ఓ లకు అధునాతన కెమెరాలు అందచేసే సమాచార, పౌర సంబంధాల శాఖ కు చెందిన ఫైల్ పై మంత్రి పొంగులేటి సంతకం చేశారు. గృహ నిర్మాణ శాఖ కు చెందిన పలు పరిపాలనా సంబంధిత ఫైళ్ల పై సంతకం చేశారు.
ప్రకాశం జిల్లా.. పెద్దారవీడు మండలం గొబ్బురు-తోకపల్లి హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బోలేరో వావానం , బైక్ డీ కొని తండ్రి, కుమారుడు, అక్కడక్కడే ఇద్దరు మృతి చెందగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. కురిచేడు మండలం నాయుడు పల్లి పంచాయతీ సంఘం గ్రామానికి చెందినవారుగా గుర్తింపు, స్వగ్రామం నుండి మార్కాపురం వచ్చి గ్రామంకు తిరిగి వెళ్లే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపడం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also….
Read Also….
జగన్ మోహన్ రెడ్డి మాటలమాత్రం కోటదాటుతున్నాయి. చేతలు మాత్రం గడప దాటడం లేదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ఘంటసాల మండలం పూషడంలో మొలకెత్తిన వరి పంటను బుద్ధప్రసాద్, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు పరిశీలించి రైతుల ఆవేదన విన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు అపార నష్టం కలిగిందని, ఈ ప్రభుత్వం బీమనది ఛానల్ మురుగు డ్రైనేజీలో తూటికాడ, గుర్రపుడెక్క సకాలంలో తొలగించలేదన్నారు. ఫలితంగా ఈ గ్రామంలో 600 ఎకరాల్లో వరి పంట దారుణంగా మొలకలు వచ్చి పంట దేనికి పనికిరాకుండా పోయిందన్నారు. బీమనది డ్రైనేజీకి రూ.12లక్షలు నిధులు కేటాయించినా పనులు జరగలేదన్నారు. తుఫాన్ ముందు సకాలంలో స్పందించి ముంపు నివారణకు చర్యలు తీసుకుంటే అపార నష్టం తగ్గేదన్నారు. ఈ ప్రాంత రైతులకు కలిగిన నష్టానికి ప్రకృతి కారణం కాదని, పాలకుల నిర్లక్ష్యమే ఈ నష్టానికి కారణమన్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నియోజకవర్గంలో ఒకట్రేండు డ్రైనేజీల దగ్గర ఫోటోలు దిగి మొత్తం పరిష్కారం చేసినట్లు ప్రచారం చేసుకున్నారని, కాని ఆయనకు పూషడం గ్రామ రైతుల సమస్యలు ఎమ్మెల్యేకు పట్టవా అని ప్రశ్నించారు. డ్రైనేజీ శాఖ అధికారులు ఎమ్మెల్యే చెప్పిన పనులే చేస్తారా? ఎక్కడ డ్రైనేజీ సమస్య ఉందో గుర్తించి సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా? అని ప్రశ్నించారు. డ్రైనేజీ పనులు తీసుకున్న కాంట్రాక్టరుతో పనులు చేయించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో అత్యధిక నష్టం కలిగిందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి రైతులను నట్టింట ముంచేశారన్నారు. తక్షణమే సీఎం జగన్ రైతులకు ఏ సహాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు పంటల బీమా ఈ ఏడాది రైతులకు వర్తిస్తుందా లేదా ప్రకటించాలని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో రైతులకు బీమా పరిహారం దక్కిన దాఖలాలు లేవన్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్ ఇప్పటివరకు మిచౌంగ్ పంట నష్టం పరిశీలించలేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ పంట నష్టం పరిశీలించాలని, ఈ పూషడం గ్రామ రైతులను పరామర్శించి, ప్రభుత్వ సహాయంపై స్పష్టత ఇచ్చి ఆదుకుంటామనే భరోసా ఇవ్వాలని కోరారు. తక్షణమే రైతులకు తదుపరి పంటకు ఇన్ పుట్స్ మొత్తం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పది ఎకరాలు సాగు చేసిన కౌలు రైతు గల్లా వెంకటేశ్వరరావు, 16 ఎకరాలు సాగు చేసిన పీ.సాంబశివరావు, ఏడెకరాలు సాగు చేసిన అంకం నాంచారయ్య తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంట పూర్తిగా నాశనం అయిపోయిందని కోత కోసినా ప్రయోజనం లేదన్నారు. వరి పంట మొత్తం దున్నేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జనసేన నాయకులు, జనసేన సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
తక్షణ మానవతావాద సాయం కోసం గాజాలో ఇజ్రాయెల్- హమాస్ కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఈ తీర్మానంలో పొందుపరిచారు. అల్జీరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, పాలస్తీనాతోపాటు అనేక దేశాలు స్పాన్సర్ చేసిన ఈ తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ సహా పది దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరో 23 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. ముసాయిదా తీర్మానంలో హమాస్ను ప్రస్తావించకపోవడంపై అమెరికా, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తప్పుబట్టాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో హేయమైన ఉగ్రవాద దాడులను ఖండించాలని, బందీల విడుదలను పేర్కొంటూ తీర్మానానికి సవరణ చేయాలని డిమాండ్ చేశాయి. జనరల్ అసెంబ్లీ నుంచి వెలువడిన శక్తిమంతమైన సందేశం పరంగా ఇదొక చారిత్రాత్మకమైన రోజు అని ఐరాసలోని పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ వ్యాఖ్యానించారు.
పుంగనూరు మేలుపట్ల కు చెందిన లతీఫ్ (28) కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున ప్రతిరోజూ కూలి పనులుకు వెళ్లేవారు. రోజు మాదిరిగా ఉదయం స్థానికంగా రాయల్ పేట రోడ్డు లో రేకులు షెడ్ వేయుటకు వెళ్లినట్లు లతీఫ్ కుటుంబ సభ్యులు తెలిపారు. రేకుల షెడ్ పనులు చేస్తున్న సమయంలో షెడ్ పై పోతున్న 11 కెవి విద్యుత్ వైర్లు ప్రమాద వశాత్తు తగిలి కాలినట్లు స్థానికులు సమాచారం. హుటాహుటిన విద్యుత్ సరఫరా నిలిపివేసి అతన్ని పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రధమ చికిత్స వైద్యులు అందించారు. మెరుగైన వైద్యం కొరకు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.
సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం భూ హక్కు చట్టం తీసుకురావడం దారుణమని న్యాయవాది వంగర వెంకటాచార్యులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ భూహక్కు చట్టం 27/2023ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదుల సంఘము ఆధ్వర్యంలో అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. అనంతరం ఆర్ డీవో అచ్యుత్ అంబరీష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ భూ హక్కు చట్టం కబ్జాదారులకు వరంగా మారనున్నదన్నారు. ఇది ఒక చీకటి చట్టం అన్నారు. రెవెన్యూశాఖ పాదాల చెంతకు ప్రజల ఆస్తి హక్కులును ప్రభుత్వం పెట్టిందన్నారు. మన హక్కులు కూడా డబ్బు పెట్టి కొనుక్కొనే చట్టం అన్నారు. ఇప్పటికే రెవెన్యూశాఖ లో రెడ్ టేపిజం, లంచగొండితనం పెరిగి పోయిందన్నారు. అధికారులు ఉత్తర్వులు ఇస్తే జిల్లా, రాష్ట్ర ట్రిబ్యునల్ దానికే మద్దతు ఇస్తుందన్నారు. అధికారులు ఇచ్చిన తీర్పును హైకోర్టులో పెట్టాలి. ఇప్పటికే హైకోర్టులో పని భారం పెరిగి పోయిందన్నారు. ఈ చీకటి చట్టాన్ని రద్దు చేసే వరకు ప్రజలు అందరూ వ్యతిరేకించాలని కోరారు.
విజయవాడ.. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. వైఎస్ఆర్సిపి ఎంపీ మిధున రెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు రుద్రరాజు, ఏపీ కాంగ్రెస్ నేతలు పొంగులేటి ను రిసీవ్ చేసుకున్నారు. ఆలయ మర్యాదలతో తెలంగాణ మంత్రికి అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్ కు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయంలో పొంగులేటి శ్రీనివాస్ రావు కు సుంకర పద్మశ్రీ వీడ్కోలు పలికారు.
శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవారిని మంత్రి నగిరి ఎమ్మెల్యే RK రోజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు బోర్డు మెంబర్లు మంత్రి రోజాకి కుంభ స్వాగతం పలికారు, స్వామి అమ్మవార్ల దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీకాళహస్తి శాసనసభ్యులు, YCP నాయకులు లోకేష్ యాదవ్ ఇతర నాయకులు మరియు ఆలయ అధికారులు మంత్రి రోజాకి శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్బారెడ్డి నగర్ లో అర్ధరాత్రి ఘటన ఓ చోటుచేసుకుంది. మృతుడు రౌడీ షీటర్ కిషోర్ గా పోలీసులు గుర్తించారు. హత్యకు కారణం తోటి స్నేహితుల మధ్య జరిగిన వివాదమే.., కత్తితో పొడిచి హతమార్చినట్టు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న ఈస్ట్ సి ఐ మహేశ్వర్ రెడ్డి అలిపిరి సిఐ అబ్బన్న బృందంతో విచారణ ముమ్మరం చేశారు.
Read Also..





Total views : 90019