కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి వేలాది మంది తరలి వచ్చారు. ఉదయమే పవిత్రమైన ధర్మగుండంలో స్నానమాచరించి ప్రత్యేక క్యూ లైన్ల మీదుగా ఆలయంలోకి వెళ్లి స్వామివారు ను దర్శించుకున్నారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కును చెల్లించారు. ఆలయంలో రద్దీతో స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది.
Read Also..





Total views : 89154