కాంగ్రెస్ నేత, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగానే జరిగింది. ఐటీ, ఈడీ అధికారులు పొంగులేటి నివాసంలో సోదాలు చేస్తున్నారు. గురువారం వేకువజామున 3 గంటల నుంచే ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాల్లో సోదాలు మొదలయ్యాయి. మొత్తం 8 వాహనాల్లో అధికారులు పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. మొదటి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత తనిఖీలు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఖమ్మంతోపాటు హైదరాబాద్లోని నందగిరిహిల్స్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఇదిలావుండగా ఐటీ దాడులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగానే ఊహించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రోద్బలంతో తన నివాసంపై, తన కుంటుంబ సభ్యుల ఇళ్లలో, తన అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగబోతున్నాయని బుధవారం మీడియా సమావేశంలో పొంగులేటి అన్నారు. రోజుల వ్యవధిలో ఇది చూడబోతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. కాగా గురువారం ఆయన నామినేషన్ వేయాలని భావించారు. ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా అనేది వేచిచూడాలి.
Srinivas Reddy
డ్రేనేజీ, వాటర్ ప్రభుత్వ స్దలాలు కాపాడుటకై తాము చిత్తశుద్దితో పని చేస్తామని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్ది కొలన్ హన్మంత్ రెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ది కొలన్ హనుమంత్ రెడ్డి బాచుపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ లో రోడ్ల గుంతలమయం అవ్వడంతో గతంలో బాచుపల్లి రెడ్డి లాబ్స్ దగ్గర్లో తండ్రీ కూతురు బస్ కింద పడిన ఘటన, బాచూపల్లి ఇందరమ్మ కాలనీలో నీళ్ల సమస్య, స్కూల్ పిల్లల స్కూల్ కి వెళ్ళాలి అంటే రోడ్ల పైన సాహసం చేయాల్సిన దుస్థితి, దేవేందర్ నాగర్ పేట్ బషీరబాద్ లలో ప్రభుత్వ స్దలాలు కబ్జాకు గురైయ్యాయని…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డ్రైనేజీ, వాటర్, డెవలప్ మెంట్ తదితర అన్ని సమస్యల పట్ల చిత్తశుద్దితో పని చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్ BRS సీనియర్ నాయకుడు కొలన్ శ్రీనివాస్ రెడ్డి BRS కు రాజీనామా చేసిన విషయాన్ని తెలుసుకొని ఆయనను పార్టీలోకి ఆహ్వానించడానికి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెల్లాడు. రేపు రేవంత్ రెడ్డి సమక్షంలో కొలన్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరుతాడని కొలన్ హన్మంతరెడ్డి తెలిపాడు.





Total views : 147292