తిరుపతి జిల్లా నాగలాపురం దళితవాడకు చెందిన నిషా 23సం”మూడు రోజుల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్యాకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మూడు రోజుల క్రితం నిషా భర్త శర్మ అక్రమ సంబంధం ఉందని నిలదీస్తూ ఆక్రోసంగా నిషా పై దాడి చేశాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. నిషా తల్లిదండ్రులు, బంధువులు మా కూతురుపై ఎందుకు దాడి చేశావు అని అడగగా, వారి పైన కూడా దాడి చేసినట్లు తెలిపారు. మనస్థాపానికి గురైన నిషా ఆత్మహత్యకు పాల్పడి నగిరి, తిరుపతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు. నిషా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి దర్శిత అనే ఒకటిన్నర సంవత్సరాల చిన్న పాప ఉన్నట్లు సమాచారం. సంబంధిత విషయంపై నాగలాపురం ఎస్ఐ ఓబయ్య వివరణ కోరగా పై విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
suicide
‘పుష్ప’లో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీశ్ (కేశవ) పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడిన జగదీశ్ను పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. జగదీశ్ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ (జూనియర్ అర్టిస్టు) గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్ ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న బండారు జగదీశన్ను ఇవాళ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.
కడప జిల్లా.. అట్లూరు మండలంలోని కోనరాజుపల్లె పాఠశాల గేటుకు ఉరేసుకుని గంపల చిన్న ఎల్లయ్య అనే (37) వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లయ్య మృతి పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అట్లూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాకినాడ లో డాక్టర్ కిరణ్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. కాకినాడ గోకులం వెనుక ఉన్న డాక్టర్ తన స్వగృహంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరిలో మృతదేహం ఉంచారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు కళ్యాణ్ పేరిట 11 ఎకరాల భూమి విక్రయించారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన అచ్చంపేట పెదబాబు పూర్తిగా సోమ్ములు చెల్లించకుండా కొంత మాత్రమే ముట్ట చెప్పి ఇక ఏమి డబ్బులు ఇచ్చేది లేదని చెప్పడంతో మనస్థాపానికి గురైన డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. దస్తావేజులు పూర్తిగా స్వాధీనం చేసుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో శనివారం మధ్యవర్తి పెదబాబు ఇంటికి వెళ్లి సోమ్ములు కోసం ప్రశ్నించగా డబ్బులు ఇచ్చేది లేదని చెప్పడంతో ఇంటికి వచ్చి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి శేషారత్నం ఆరోపిస్తున్నారు.
Read Also..
ఆన్లైన్ జూదం విద్యార్థులను, ఉద్యోగులను, వ్యాపారస్తులను ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూ వస్తున్నది. కరోనా కాలంలో ఆన్లైన్లో ఖాళీగా ఉన్న విద్యార్థులు, వ్యాపారాలు ఆగిపోయిన వ్యాపారస్తులు, ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులు ఇంటర్ నెట్ లో పార్ట్ టైం ఉద్యోగాలు, మొబైల్ ఫోనుతో డబ్బులు ఎలా సంపాదించాలి అని గూగుల్ను ఆశ్రయించడం ఎక్కువైంది. ఈ సమాచారాన్ని ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ నిర్వహించే వారు, సైబర్ నేరగాళ్లు కొనుక్కుంటారు. ఈ సమాచారాన్ని ఆధారం చేసుకుని రిజిస్టర్ ఎలా అవ్వాలి, ఎలా డబ్బులు డిపాజిట్ చెయ్యాలి, ఎలా ఆటలలో ఇన్వెస్ట్ చెయ్యాలి, ఎంత డబ్బు పెడితే ఎంత డబ్బు వస్తుంది, అనే పూర్తి వివరాలు అందిస్తారు. 100 రూపాయల నుండి మొదలుకొని ఎంత డబ్బు అయినా అందులో డిపాజిట్ చేయవచ్చు. ఈ విధంగా యువత ఆన్ గేమింగ్ వైపు మళ్లి బలయిపోయారు. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆన్లైన్ గేమ్ ఆడి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు చేసి సుమారు రూ. 2 లక్షలు పోగొట్టుకున్న విద్యార్ధి ప్రశాంత్. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also..
Read Also..
ములుగు జిల్లా మంగపేటలో విషాదం చోటుచేసుకుంది. మల్లూరు అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది.ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా , యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఏటూరునాగారం మండలం కు చెందిన బెజ్జంకి రాజేష్ ,కమలాపురానికి చెందిన మాదరి శిరీష (22) అనే యువతి ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నా పెళ్లి విషయంలో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి. పెళ్లి చేయరనే మనస్తాపంతో ప్రేమజంట అటవీ ప్రాంతం లోకి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందగా.. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.





Total views : 147657