తెలంగాణ(Telangana) టంగుటూరు:
టంగుటూరు(Tanguturu)లో విషాదం. ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి చెట్టుకు ఉరి వేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో అప్పుల బాధతో నిరటి రవి (35)అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంత కాలంగా గ్రామంలోని ప్రజల వద్ద ఇతర గ్రామాల ప్రజల వద్ద నుంచి మనీ స్కాం నిర్వహిస్తూ వెయ్యికి 3000 లక్షకు 58 రోజులకు 5 లక్షలు ఇప్పిస్తానంటూ డబ్బులు కట్టించాడు తీరా డబ్బులు రాకపోవడంతో డబ్బులు కట్టిన ప్రజలు ఇంటికి రావడంతో ఏం చేయాలో తోచక ఇంట్లో పిల్లలను చంపి తాను పంట పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సంఘటన స్థలానికి మోకిలా పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 89057