అధికార పార్టీ వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శ్రీకాకుళం జల్లా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. సాధారణంగా ఇలాంటి సమావేశాలు, సభలు ఊరికి బయట ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటారు. దానికి విరుద్ధంగా నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్ని, సర్కిల్ను బ్లాక్ చేసేసి మరీ వేదికను ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని తుడ్డలిలో వైసీపీ చేపట్టిన సామాజిక బస్సు యాత్ర అరాచకమే సృష్టించిందని చెప్పవచ్చు. ప్రధాన రహదారిపై స్టేజి వేయటంతో పాలకొండ-రాయఘడ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రెండువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Tag:




Total views : 61608