సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో నిన్న అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటనలో స్థానికంగా నివసించే హజ్జు అనే యువకుని పై అదే గ్రామానికి చెందిన బాలరాజు గంజాయి మత్తులో దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో తీవ్రంగా గాయాలు కాగా అతని కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలు అనునిత్యం రుద్రారం గ్రామంలో జరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. దీనిపై స్థానిక నేతలు, పోలీస్ వ్యవస్థ చర్యలు చేపట్టకపోవడంతో గ్రామంలో గంజాయి సేవించే యువకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Read Also..






Total views : 75454