124
పశ్చిమాసియా యుద్ధ సెగ ఐటీ ఉద్యోగులకు తగిలింది. ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపాయి. కేవలం ముఖ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే సరఫరా చేస్తామని, ఎక్కువ టైమ్ తీసుకునే చపాతీ, పూరి లాంటి వంటకాలు తయారుచేయలేమని స్పష్టం చేశాయి. కొన్ని కూరలు, ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ బంద్ చేశాయి. సొంతంగా వంట చేసుకోవడానికి వీల్లేదు అంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాల పేర్కొన్నాయి.



Total views : 47746