Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News స్టాక్ మార్కెట్లులో భారీ నష్టాలు

స్టాక్ మార్కెట్లులో భారీ నష్టాలు

by Satya
Stock markets

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 283 పాయింట్లు నష్టపోయి 63,591 వద్ద స్థిరపడింది. 90 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 18,989 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ బ్యాంక్ 109 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకింగ్, ఆటోషేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ప్రపంచ మార్కెట్లలో ఉన్న ప్రతికూల సంకేతాలు ఇక్కడి మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఫలితంగా మార్కెట్ల ఆరంభంలో కాస్త లాభాలు కనిపించినా ఇంట్రాడేలో నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లు ముగిసే వరకు అదే పరిస్థితి కొనసాగింది. అదానీకి చెందిన పలు కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఆసియన్ పెయింట్స్, అదాని పోర్ట్స్ ఎక్కువగా నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజిలో జిందాల్ స్టీల్ అండ్ పవర్, నాట్కో ఫార్మా, కేర్ రేటింగ్స్, డీసీఎం శ్రీరాం, స్టార్ హెల్త్ బాగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఇంత నష్టాల్లో కూడా కొన్ని కంపెనీ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీలో సన్ ఫార్మా, భారత్ పెట్రోలియం, హిండాల్కో, బజాజ్ ఆటో, రిలయన్స్ లాభపడ్డాయి. బీఎస్ఈలో గ్రీన్లాం, క్రెసాండా సొల్యూయన్స్, వొడాఫోన్ ఐడియా, బ్లూస్లార్, గ్రావిటా కంపెనీలు లాభాలను ఆర్జించాయి.

Advertisements

You may also like

Our Visitor

019302
Total views : 90262

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.