భారతీయ జనతా పార్టీ గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ (ఇంచార్జ్) కురుమద్దాలి ఫణి కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు, సంబరాల్లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాదు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాదెండ్ల మోహన్, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు కానూరు శేషు మాధవి బిజెపి నాయకులు, ఈ సందర్భంగా కురుమద్దాలి ఫణి కుమార్ మాట్లాడుతూ దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో కంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరిగినందుకు సంతోషిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయానికి కృషి చేస్తాం. భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం మనదేశానికి ఏ విధమైన ఆటంకం గాని కీడులుగాని జరగవని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ప్రజలు కూడా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాం.
భారతీయ జనతా పార్టీ నాయకుల సంబరాలు..
241
previous post




Total views : 61697