హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం భూ ఉపరితలం నుంచి కేవలం 5 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు సెస్మిక్ డేటా వెల్లడించింది. తక్కువ లోతులో భూకంపం సంభవించడం వల్ల చంబా జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం సంభవించిన వెంటనే ప్రజలు అప్రమత్తమై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కొద్దిసేపు భయాందోళనలకు గురైనప్పటికీ, పరిస్థితి అనంతరం సాధారణ స్థితికి చేరుకుంది. తక్కువ లోతులో వచ్చే భూకంపాలు తీవ్రత పరంగా మోస్తరుగా ఉన్నా, భూకంప కేంద్రానికి సమీప ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్లో భూప్రకంపనలు.
515
previous post