Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Latest News బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.

by CVR NEWS

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఎయిమ్స్‌లోని వివిధ వార్డులు, అత్యవసర విభాగాలను పరిశీలించిన జేపీ నడ్డా… రోగులకు అందుతున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి… 2014 తర్వాత దేశంలో రికార్డు స్థాయిలో 23 ఎయిమ్స్ ఆసుపత్రులు వచ్చాయని గుర్తుచేశారు. వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, త్వరలోనే ఇది ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: