364
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ పాల్గొన్నారు. బాపట్ల మండలం నగర వనంలో మొక్కలు నాటి, స్వయంగా యోగా ఆసనాలు వేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగా ద్వారా ఆరోగ్యం, ఆహ్లాదం లభిస్తాయని, ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రకృతి మధ్యలో యోగా చేయడం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని, ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.