కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే వశిష్ట నదీపాయపై నిర్మించిన దిండి – చించినాడ బ్రిడ్జి మరమ్మతు పనుల్లో ఎన లేని జాప్యం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఈ వారధిపై బస్సులు, భారీ వాహనాలు వంటివి ప్రయాణించే పరిస్థితులు లేవు. ఎప్పటికీ ఈ వారధి మరమ్మతు పనులు పూర్తవుతాయో జాతీయ రహదారుల శాఖ అధికారులు చెప్పలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. గత కొన్ని నెలల నుంచి దిండి-చించినాడ మధ్య భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో… రాజోలు, అటు పాలకొల్లు, నరసాపురం, ఇటు అమలాపురం డిపోల నుంచి బస్సులన్నీ రావులపాలెం, సిద్ధాంతం మీదుగా వెళుతున్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల వారధిగా ఉన్న ఈ వంతెన పైనుంచి స్కూళ్లు, కాలేజీల బస్సులు వందకు పైగానే నిత్యం నడుస్తుంటాయి. అయితే బస్సుల రాకపోకలు నిలిపివేయడం వల్ల విద్యార్థులు ఇరువైపుల నుంచి కాలినడకన నడిచి వంతెనకు అటు, ఇటు ఉంచిన వాహనాలపై కాలేజీలకు వెళ్లవల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ వారధి పనులు ఎప్పటికి పూర్తవుతాయో N H అధికారులు స్పష్టంగా చెప్పకపోవడంతో ప్రజలు వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే వశిష్ట నదీపాయపై నిర్మించిన దిండి..
84




Total views : 47778