శ్రీకాకుళం జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటించనున్నారు. 80 అడుగుల రోడ్డులో ‘రా.. కదలిరా’ పేరిట నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత పాల్గొననున్నారు. టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు.
ఈ సభలో లక్ష మందికి పైగా టీడీపీ – జనసేన శ్రేణులు పాల్గొనే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. సభ వేదికపై 76 మందికి పైగా కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు రా కదలిరా బహిరంగ సభ ప్రారంభం కానుంది.