Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Andhra Pradesh రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం అన్న చంద్రబాబు..

రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం అన్న చంద్రబాబు..

by CVR NEWS
రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం అన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ సమావేశాల్లో చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతానికి భిన్నంగా ఈసారి ఆయన తన ఆలోచనలను ఎంతో స్పష్టంగా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ప్రధానం అని, వ్యక్తిగత సంబంధాలు లేదా ఒత్తిడులు తన నిర్ణయాలపై ప్రభావం చూపవని ఆయన తేల్చి చెప్పారు. బాధ్యతలు అప్పగించే విషయంలో పనితీరు, నిబద్ధత, సమర్థత వంటి అంశాలనే పరిగణనలోకి తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఎవరికైనా పదవి ఇవ్వడం అనేది సాదాసీదా విషయం కాదని, దాని వెనుక గట్టి పరిశీలన ఉంటుందని తెలిపారు. నాయకుడు అంటే ముందుగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే వ్యక్తి కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాల్లో ఎక్కడా రాజీ పడబోనని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో పార్టీ నేతలకు ఇది ఒక స్పష్టమైన హెచ్చరికగా మారింది. ఇకపై కేవలం అనుబంధాలు కాదు, పనితీరు ఆధారంగానే గుర్తింపు లభిస్తుందని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది.ఒక వైపు హెచ్చరికలు చేస్తూనే కొందరి నేతలకు సూచనలు కూడా చేసారు .ఫ్లెక్సీల దగ్గర , ఫొటోల దగ్గర అనవసర గొడవలకు దిగరాదని సూచించడం కూటమి ఐక్యతకు కట్టుబడినట్లు తెలుస్తుంది .

పార్టీ పదవులు అలంకారాలు కావని, అవి బాధ్యతలని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పదవి దక్కిందంటే అది గౌరవం మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత కూడా అని ఆయన గుర్తు చేశారు. ప్రతి నాయకుడు తనకు అప్పగించిన బాధ్యతను నిజాయితీగా నిర్వహించాలని ఆయన సూచించారు. కేవలం పదవిలో కూర్చోవడం కాకుండా, అందరినీ కలుపుకుని ముందుకు సాగడం నాయకత్వ లక్షణమని చెప్పారు. సమన్వయం, సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకుల పనితీరే వారి సమర్థతకు గీటురాయి అవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రతి పోలింగ్ బూత్‌లో ఓట్ల శాతం పెంచడంపై దృష్టి పెట్టాలని అన్నారు. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించడం ప్రతి నాయకుడి లక్ష్యంగా ఉండాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

టీడీపీ లో పనితీరుకు ప్రాధాన్యం మరింత పెరగనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పార్టీ వ్యవస్థలో క్రమశిక్షణను మరింత కఠినతరం చేసేలా ఉన్నాయి. ‘మై టీడీపీ’ యాప్ ద్వారా నాయకుల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తామని ఆయన చెప్పడం గమనార్హం. దీంతో పదవి పొందడం ఒక్కటే కాకుండా, నిరంతరం పని చేసి తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర, జాతీయ స్థాయి కమిటీల్లో అవకాశాలు పొందిన నాయకులు ఇప్పుడు అధినాయకత్వం ఆశించిన స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో విశ్వాసం సంపాదించడం, పార్టీ పెద్దల మన్ననలు పొందడం ఇప్పుడు ముఖ్యంగా మారింది. 2024 కంటే 2029లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రతి నాయకుడు కృషి చేయాలని ఆయన సూచించారు. మొత్తంగా చూస్తే, పదవులు సంబరాల కోసం కాదు, పనితీరు ద్వారా గుర్తింపు పొందే సాధనాలుగా మారాయని చెప్పాలి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

009322
Total views : 61457

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.