దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం సోమవారం నాడు భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని తరించారు. తొలుత ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా లఘు దర్శనం అమలు చేయడంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. కళాభవన్లో శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, బాలాత్రిపుర సుందరి దేవి ఆలయంలో కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును పెద్ద సంఖ్యలో భక్తులు చెల్లించుకున్నారు. అనుబంధాలయమైన బద్దిపోచమ్మ దేవాలయం సైతం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. వందలాది మంది భక్తులు బద్దిపోచమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
Devotional
నంద్యాల మండలం సుగలిమెట్ట వద్ద పోలంలో బయటపడిన అమ్మవారి విగ్రహం. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి మహనంది దర్శించడానికి వెళ్తుండగా సదరు వ్యక్తికి ఇక్కడ నేనున్నానని చెవిలో చెప్పిన అమ్మవారు. గత రెండు రోజుల నుండి వెతుకగా సుగాలిమెట్ట వద్ద బయటపడ్డ అమ్మవారి విగ్రహం. అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. అమ్మవారి విగ్రహం బయటపడడంతో కోలాహలంగా మారిన సుగాలిమెట్ట ప్రాంతం. అమ్మవారిని దర్శించుకుని పూజలు టెంకాయలు అర్పిస్తున్న భక్తులు….
సుబ్రహ్మణ్య షష్టి పురస్కరించుకుని ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. శ్రీ మాణిక్యాంబ అమ్మ వారిని, శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. ఆలయ ప్రాంగణంలో గల శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పువ్వు,పడగలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజామునుంచి భక్తులు ఇక్కడకు చేరుకోవడంతో క్యూలైన్లు అన్నీ బారులు తీరాయి. భక్తులు రద్దీకి తగ్గట్టుగా దేవాదాయ,ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు…
సుబ్రహ్మణ్యేశ్వ స్వామి షష్ఠి మహోత్సవాలను సోమవారం కొత్తపేట నియోజకవర్గం లో వాడ వాడలా ఘనంగా నిర్వహించారు.భక్తులు వేకువ జామున నుంచే ఆలయాలకు చేరుకొని స్వామిని దర్శించుకుని పూలు,పడగలు సమర్పించుకున్నారు.పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి.ముఖ్యంగా కొత్తపేట మండల పరిధిలోని వాడపాలెం లో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారు జామున నుండే స్వామి వారికి ప్రధాన అర్చకులు శ్రీను,మణి,సాయి గార్ల చే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.అత్యధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి స్వామి వారిని దర్షించుకున్నారు.అలాగే కొత్తపేటలో పురాణ ప్రసిద్ది చెందిన హరి హర దేవాలయం ప్రాంగణంలో గల వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అత్యధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.ఆలయాల వద్ద రద్దీ ఎక్కువవడంతో భక్తుల క్యూ లైన్లుతో ఎక్కడికక్కడ బారులు తీరారు.నియోజకవర్గం లోని పలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.మండలం లో ఆయా ఆలయాల వద్ద షష్ఠి తీర్థాలు ఘనంగా నిర్వహించారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ సోమవారం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,పాలు,మంచినీరు అందిస్తున్నారు.
అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన కోటి అక్షంతలు ఊరేగింపు కార్యక్రమం మార్కాపురం పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. జనవరి 22న కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా అయోధ్య నుంచి మార్కాపురం పట్టణానికి వచ్చినటువంటి స్వామి వారి తలంబ్రాల అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మార్కాపురం శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద నుండి డప్పు కోలాట చప్పుళ్ల మధ్య అక్షింతల కలశాలతో శోభాయాత్రను నాలుగు మాడవీధులలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వహిందూ పరిషత్తు అఖిల భారత ప్రధాన కార్యదర్శి యక్కలి రాఘవులు గారు విచ్చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం రామచంద్రుని 600 సంవత్సరాల కల నేటికి తీరిందని ఈ యొక్క పవిత్రమైన అక్షింతలను జనవరి రెండవ తేదీ నుండి పట్టణ మరియు పరిసర ప్రాంతం గ్రామాలలో ప్రతి ఇంటికి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు మరియు స్వామివారి రూపం, ఫోటోలను, ప్రతి గడపకు చేరవేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని 22వ తేదీ ప్రాణ ప్రతిష్ట రోజున ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి భక్తిని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు, పలు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భక్తుల నుండి అనధికారికంగా కేశఖండనశాల వద్ద ఆలయ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం కేశఖండన కు 40 రూపాయల టికెట్ను పెట్టగా.. ఆలయ సిబ్బంది భక్తుల దగ్గర అదనంగా 50 రూపాయలు నుండి 100 రూపాయిల వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. డబ్బులు డిమాండ్ చేస్తున్న అడగలేని నిస్సహాయ స్థితిలో భక్తులు, పట్టించుకోని దేవాదయ శాఖ ఉన్నతాధికారులు.
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు తీపి కబురు అందించింది. ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంచి. మార్చి మాసానికి సంబంధించిన దర్శన, సేవా టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ నమోదు కోసం భక్తులకు అవకాశం లభిస్తుంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 20వ ఉదయం 10 గంటల వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని టీటీడీ తెలిపింది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల విడుదల చేస్తారు. 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్ల విడుదలవుతాయి. 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్ల విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్దులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. దాతల దర్శనం, గదుల కోటా వెలువరిస్తారు. 25న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఇంద్ర పాలెం లోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామి వారు స్వయంభు, 18వ తేదీ సోమవారం తెల్లవారుజాము నుంచి సృష్టికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి షష్టికి 40 వేల పైబడి భక్తులు వస్తారని అందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈవో జోగా సత్యనారాయణ తెలిపారు. స్వయంభు దేవాలయం కావడంతో భక్తులు సంఖ్య ఏటేటా పెరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు దత్తు తెలిపారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారని ఆయన వెల్లడించారు.
Read Also..
శ్రీ క్షేత్ర దత్తాత్రేయ ఆలయం మనం సాధారణంగా ఏ గుడిలో అయినా దేవుడి విగ్రహాలను దర్శించుకుంటాం. అయితే కర్నాటకలోని ఆ ఊరిలో మాత్రం స్వామి వారి పాదుకలు మాత్రమే దర్శనమిస్తాయి. అంతేకాదు ఆ గుడిలో దయ్యాలు, భూతాలను వదిలిస్తారట. అక్కడి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్షేత్ర దత్తాత్రేయ ఆలయం ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ మనలో చాలా మంది స్నేహితుల దగ్గరో లేదా బంధువుల దగ్గరో దయ్యాల కథ గురించి వింటూ ఉంటారు. అయితే అవన్నీ అభూత కల్పనలనీ చాలా మంది కొట్టిపారేస్తుంటారు. కానీ కర్నాటక రాష్ట్రంలోని కల్బూర్గి ఆలయంలో మాత్రం ఇప్పటికీ దయ్యాల్ని వదిలించడం, ఆత్మల్ని బంధించడం, చేతబడి తొలగించడం వంటి వాటిని ప్రత్యక్షంగా చూడొచ్చు. అందుకే గానగాపూర్ ఆలయాన్ని ఆధ్యాత్మిక స్వర్గంగా భావిస్తారు చాలా మంది భక్తులు. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలా మంది నమ్ముతారు. గానుగాపూర్ అంటే అందరికీ గుర్తొచ్చేది దత్తాత్రేయుని దేవాలయం. ఎందుకంటే ఈ క్షేత్రంలో పాదుకల రూపంలో భక్తుల కోరికలను తీర్చే స్వామి దత్తాత్రేయుడు. దత్తాత్రేయుని రెండో అవతారమైన నరసింహ సరస్వతి అవతారం 1378 సంవత్సరం పుష్య శుద్ధ విదియ నాడు జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ కారణ జన్ముడి తల్లిదండ్రులు మాధవ శర్మ, అంబభవానీ. ఈ స్వామివారి పూర్వనామం నరహరి. పాదుకలకు ప్రతిరోజూ అభిషేకం. ఈ ఆలయంలో స్వామి వారి పాదుకలకు ప్రతిరోజూ అభిషేకం, పాదుకా దర్శనం ఉదయం 9 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అభిషేకం ముగిసిన తర్వాత పాదుకలను పూలు, వస్త్రాలను కప్పుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే ప్రతి గురువారం రాత్రి పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు.
Read Also..
Read Also..