విజయవాడ(Vijayawada) తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్(12th Division) లో వైసీపీ నేతలు(YCP leaders) ఎన్నికల ప్రచారం(Election Campaign) నిర్వహించారు. అభ్యర్థులు దేవినేని అవినాష్(Devineni Avinash), కేశినేని నాని(Keshineni Nani) విజయాన్ని కాంక్షిస్తూ కేశినేని హైమ మరియు దేవినేని సుధీర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
12వ డివిజన్ లో కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను అవినాష్ పరిష్కరించాడన్నారు. కరెంటు సమస్య ఉన్న ఈ ప్రాంతంలో 6 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు ఇంటి ముందు రోడ్డు కూడా అవినాష్ వేయించాడన్నారు.
కోటి రూపాయల వ్యయంతో మైనారిటీ ల కోసం ఉర్దూ స్కూల్ ఏర్పాటు చేశారన్నారు. గత రెండు ఎన్నికల్లో నాని గారిని గెలిపించినట్టు, ఈసారి కూడా దేవినేని అవినాష్ మరియు కేశినేని నానికి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటనఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఏడో రోజున సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పరివర్తన, పౌర సేవల్లో సాంకేతికత వినియోగంపై మంత్రుల బృందం సమగ్ర అధ్యయనం చేసింది. సింగపూర్…
- విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయులు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,…
- గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రోజు రోజుకీ తీవ్రమవుతోంది. నదులు, వాగులు సహజసిద్ధంగా ఉండాల్సిన చోట రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, లారీలు విరుచుకుపడుతూ ఇసుకను తరలిస్తున్నాయి. ఈ దోపిడీ వల్ల పర్యావరణ సమతుల్యతకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతోంది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 56862