విజయవాడ(Vijayawada) తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్(12th Division) లో వైసీపీ నేతలు(YCP leaders) ఎన్నికల ప్రచారం(Election Campaign) నిర్వహించారు. అభ్యర్థులు దేవినేని అవినాష్(Devineni Avinash), కేశినేని నాని(Keshineni Nani) విజయాన్ని కాంక్షిస్తూ కేశినేని హైమ మరియు దేవినేని సుధీర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
12వ డివిజన్ లో కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను అవినాష్ పరిష్కరించాడన్నారు. కరెంటు సమస్య ఉన్న ఈ ప్రాంతంలో 6 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు ఇంటి ముందు రోడ్డు కూడా అవినాష్ వేయించాడన్నారు.
కోటి రూపాయల వ్యయంతో మైనారిటీ ల కోసం ఉర్దూ స్కూల్ ఏర్పాటు చేశారన్నారు. గత రెండు ఎన్నికల్లో నాని గారిని గెలిపించినట్టు, ఈసారి కూడా దేవినేని అవినాష్ మరియు కేశినేని నానికి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.