తిరుపతిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రోజురోజుకీ హై టెన్షన్ వాతావరణంలో ప్రచారాలు జరుగుతున్నాయి. తిరుపతిలో వైసిపికి, కూటమి అభ్యర్థి మధ్య రోజురోజుకీ వివాదం ముదురుతుంది. నిన్న జరిగిన ఘటనపై కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆరని శ్రీనివాసులు వ్యవహార శైలిపై టిటిడి చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుది హత్యా రాజకీయాల నేపథ్యం ఉన్న వ్యక్తి అని,.. ఇక్కడ గుండాగిరితో రాజకీయాలు చేయాలను కుంటే తస్మాత్ జాగ్రత్త ఆరణి శ్రీనివాసులు అంటూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి రాజకీయాలను తిరుపతి ఎన్నటికీ అంగీకరించదని, ఇలా వ్యవహరించే వారిని తిరుపతి తుడిచి పెట్టేసింది అని అన్నారు. చిత్తూరులో హత్యారాజకీయ సంప్రదాయంలో పెరిగిన కలుపు మొక్క ఆరణి శ్రీనివాసులు అంటూ ఘాటుగా విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ప్రశాంతతకు నిలయమైన తిరుపతి లో అలజడులు సృష్టించేందుకు, గూండాగిరితో చేయాలని చూస్తున్న వ్యక్తి శ్రీనివాసులు అని, ఈ వ్యక్తి తిరుపతి లో అల్లర్లు లేకుండా చేస్తాడంట.. పవిత్రతను కాపాడుతాడంట.. శ్రీనివాసులు ఇంకా చాలా చాలా సుద్ధులు మాట్లాడం ఆపు అంటూ హెచ్చరించారు. తిరుపతిలో ఎవరూ దొరక్కపోతే, చిత్తూరు నుంచి రెండు వేల మంది రౌడీలను తీసుకొచ్చి దాదాగిరి చేయాలని చూస్తున్నాడు. ఆరణి శ్రీనివాసులు పత్రికల ద్వారా సుద్ధులు చెప్పడం కాదు.. తిరుపతి ప్రజలు చాలా మంచి వారు కాబట్టి ఓటుతో నీకు తగిన బుద్ధి చెబుతారు అంటూ హెచ్చరించారు. నీ బతుకే, నీ నేపథ్యమే హత్యా రాజకీయాల నేపథ్యం…నువ్వేంది, కాపాడేదేంది…? చిత్తూరులో ఉన్న సంస్కృతిని తిరపతికి తెస్తూ, మా అరాచకాన్ని ఆపుతానంటావా..? మేము చేస్తున్న మంచిని తుడిచేయాలని, మేము చేసే సేవలు ప్రజలకు అందకుండా చేయాలననే హింసా నేపథ్యంతో ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతున్నాడు అన్నారు. టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తిరుపతిలో ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మెక్సికోలో భారీ భూకంపం.మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చోటుచోసుకున్న ఈ భూప్రకంపనల ప్రభావం మెక్సికో సిటీతో పాటు ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది. గంట వ్యవధిలో…
- షార్ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం.భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. హైదరాబాద్కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ నేడు నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించడానికి సిద్దంగా ఉంది. ఈ ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు…
- తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం.తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై-మధురై హైవేపై ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు 23 మంది ప్రయాణికులు. ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.…




Total views : 214648