చిరుతపులి(Leopard)తో రియల్ గా ఫైట్ చేశాడు రాజస్థాన్(Rajasthan)లో ఓ సాహస జర్నలిస్ట్(Journalist). దుంగార్పుర్ జిల్లాలోని గడియా భదర్ మెట్వాలా గ్రామానికి ఓ జర్నలిస్ట్ కవరేజ్ కోసం వెళ్లాడు. అదే సమయంలో సమీపంలోని భదర్ అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుత పులి గ్రామంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో దానిని తరిమికొట్టేందుకు స్థానికులు ప్రయత్నించారు.
ఇది చదవండి: Delhi : కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా..!
అయితే, అక్కడ కవరేజ్ చేస్తున్న జర్నలిస్ట్ పై చిరుత దాడి చేసింది. అతడి కాలును నోటితో కరిచి పట్టుకుంది. దాంతో.. ఆ జర్నలిస్ట్ భయపడకుండా ధైర్యంగా చిరుతతో పోరాడి.. దాని దవడను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చేంతవరకు గ్రామస్థులు చిరుతను తాడుతో బంధించారు. అనంతరం అటవీశాఖ సిబ్బంది చిరుతపులిని బంధించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 56858