Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh కుటుంబ సమేతం గా లాలూ ప్రసాద్ యాదవ్ శ్రీవారి దర్శనం

కుటుంబ సమేతం గా లాలూ ప్రసాద్ యాదవ్ శ్రీవారి దర్శనం

by Prakash
lalu prasad yadav an his family

ఆర్ జే డి అధినేత, బీహార్ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న సాయంకాలం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గాన తిరుమలకు వచ్చి రాత్రి తిరుమలలోని బస్సు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్, కుటుంబ సభ్యులు.ఈ రోజు ఉదయం లాలూ ప్రసాద్ యాదవ్,ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి రబ్రి దేవి, ఆయన తనయుడు బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఇతర కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు, ఆలయాధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసి దర్శనం చేయించారు. అనంతరం ఆలయం వెలుపల బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తన కుమారుడి తలనీలాల సమర్పణ కోసం వచ్చామని,తలనీలాలు సమర్పించి కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, మా కుటుంబంతోపాటు దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించాను అని అన్నారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: