ప్రధాని మోదీ ఉగ్రవాది అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు కేంద్ర మంత్రులు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే ఎన్నికల సంఘం నుంచి ఈ స్పందన వచ్చింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్లో గురువారం పోలింగ్ జరగనున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడికి నోటీసులు వచ్చాయి. చెన్నైలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. అన్నాడీఎంకేపై విరుచుకుపడ్డారు. అన్నాదురై ఫొటో పెట్టుకునే అన్నాడీఎంకే నేతలు మోదీతో ఎలా చేతులు కలపగలరు? అని ప్రశ్నించారు. సమానత్వంపై ఆయనకు నమ్మకం లేదంటూ మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేయగా తన వ్యాఖ్యల్లోని ఉద్దేశంపై ఖర్గే వివరణ ఇచ్చారు. మోదీని ఎప్పుడూ ఉగ్రవాది అనలేదని, దేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని ఆయన టెర్రరైజ్ చేస్తున్నారని చెప్పడమే తన ఉద్దేశమని వివరించారు.
ప్రధాని మోదీపై వ్యాఖ్యలు…
415
previous post