బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎదగనివ్వలేదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. సూర్యాపేట జనగర్జన బహిరంగ సభలో అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని సభలో ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలకు ఇది సువర్ణ అవకాశంగా లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. మేధావులు, వివిధ సంఘాల నాయకులు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలవాలని కోరారు.
Tag:






Total views : 78181