బాపట్ల పట్టణ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బాపట్ల శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సూళ్ళూరు య.చంద్ర, RSS నగర కార్యవాహ ఉపేంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో 1000 మంది విద్యార్థులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సూళ్ళూరు యచంద్ర మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా దేశంలో అనేక విద్యార్థుల గుండెల్లో జాతీయ భావాలను నింపుతూ క్షణం క్షణం మాకణం కణం భరతమాతకే సమర్పణం అంటూ ఏబీవీపీ సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తుందని. విద్యార్థుల సమస్యలు పరిష్కారం కొరకే కాకుండా విద్యార్థుల్లో చైతన్యం కోసం కూడా ఏబీవీపీ నిరంతరం పనిచేస్తుందన్నారు. భారతదేశ స్వతంత్రం కోసం అనేకమంది స్వతంత్ర సమరయోధులు ప్రాణాలర్పించారని వారు కన్నా కలలన్నింటిని నేటి యువత ఆదర్శంగా తీసుకొని వాటిని నెరవేర్చకోవడానికి కృషి చేయాలన్నారు. ఏబీవీపీ సాధిస్తున్న ప్రతి విజయం ఈ దేశం కోసం నిరంతరం సరిహద్దుల్లో గస్తీగాస్తు ప్రాణాలు సైతం అర్పిస్తున్నటువంటి ప్రతి సైనికుడికి అంకితం చేస్తుందని, ఇటువంటి అనేక కార్యక్రమానికి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పాల్గొనేందుకు సిద్ధపడాలని పేర్కొన్నారు.
Tag:
A huge rally
మంథని మండల కేంద్రంలో బి ఎస్ పి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా చల్లా నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగమే బి ఎస్ పి మ్యానిఫెస్టో అని అన్నారు. మంథని ప్రాంతంలో పాలించిన నాయకులు ఇక్కడి ఇసుకను, బొగ్గును, నిధులను ప్రాజెక్టుల పేరిట ఇక్కడి నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఈ ప్రాంత ప్రజలు ముంపుకు గురైనా నష్ట పరిహారం కూడా ఇప్పించలేదని ఆరోపించారు. లు ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రజలకు ఏలాంటి మేలు జరుగలేదని అన్నారు. అందుకే బహుజనుల కోసమే తాను ఎమ్మెల్యే బరిలో నిలిచానని, ఈ ఎన్నికలలో బహుజనులు తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు.