అలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర ఆలయాలను చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నాగర్ కర్నూల్ బిజెపి ఎంపీ అభ్యర్థి పి భరత్ ప్రసాద్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు పాల్గొన్నారు. ఆలయాలకు చేరుకున్న డీకే అరుణ బిజెపి నాయకులకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి బాల బ్రహ్మేశ్వర, శ్రీ జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ మాట్లాడుతూ… ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలవడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నాడని మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ప్రజల ఆశీర్వాదం పొందుతున్నారని నాగర్ కర్నూల్ బిజెపి అభ్యర్థిగా పి భరత్ ప్రసాద్ ను గెలిపించాలని శ్రీ జోగులాంబ అమ్మవారిని ఆశీస్సులు తీసుకొని జరిగిందని తెలిపారు.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: Saidi Reddy: మాజీ ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ వైరల్…



Total views : 61582