ఎస్.కోట స్వర్ణాభరణాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదిలక్ష్మి జ్యూయలర్స్ తన మొదటి బ్రాంచ్ ను ఎస్ కోటలో సీని నటి అనసూయ భరద్వాజ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ స్వర్ణాభరణాల విక్రయంలో ఆదిలక్ష్మి జ్యూయలర్స్ కు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు. నాణ్యతతో కూడిన ఆభరణాలు అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందిందన్నారు. ఈ బ్రాంచ్ కూడా కస్టమర్ల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాట్లాడుతూ బంగారు ఆభరణాలు అంటే మహిళలకు అమితమైన ఇష్టమన్నారు. అందుకే ఏ సందర్భం వచ్చినా బంగారు ఆభరణాలు కొంటూ ఉంటారన్నారు. అయితే, బంగారు ధరలు ఈమధ్యన భారీగా పెరిగాయన్నారు. బంగారం విలువ ఎప్పటికీ తగ్గదన్నారు. నాణ్యమైన బంగారు ఆభరణాలు కస్టమర్లకు అందించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఇంత పెద్ద జ్యూయలరీ షోరూమ్ ఓపెన్ చేయడం ఆనందదాయకం అన్నారు. ఈ చుట్టు పక్కల ప్రాంతీయులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
Tag:
anasuya bharadwaj
అన్నమయ్య జిల్లా రాజాంపేట పట్టణంలో 5వ ఎంజీఆర్ షాపింగ్ మాల్ ను జబర్దస్త్ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు. అనసూయ భరద్వాజ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. ఎంజీఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా అంటూ రాజంపేట పట్టణంలో సందడి చేశారు. గతంలో అమలాపురం, రాయచోటి లో ఎంజీఆర్ షాపింగ్ మాల్ లను ప్రారంభించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంజీఆర్ షాపింగ్ మాల్ కు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది.
Read Also…
Read Also….





Total views : 46205