రంగారెడ్డి జిల్లా, అత్తాపూర్(Attapur) పోలీస్ స్టేషన్
రాజేంద్రనగర్ సర్కిల్(Rajendranagar Circle) అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. అక్బర్ హిల్స్ కాలనీ సుల్తాన్ అపార్ట్మెంట్ సెల్లార్ లో కార్ పార్కింగ్ చేసిన కారు యాజమాని అయ్యాజ్ అహ్మద్, కారు చక్రాల కింద ఉన్న పసికందును గమనించకుండా కారు రివర్స్ తీసుకుంటూ ఉండగా కార్ చక్రాల కింద చిన్నారి నలిగిపోవడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. చనిపోయిన చిన్నారి అదే అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా నివసిస్తున్న శ్రీను దంపతుల కుమార్తె గా గుర్తించారు. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా అత్తాపూర్ పోలీసులు. కళ్ళ ముంగటే చిన్నారి కారు చక్రాల క్రింద నలిగి చనిపోయి పడి ఉండడంతో, తమ గారాల పట్టి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 62241