ఆమనగల్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దీవెన సభలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నవ నిర్మాణ భారత్ గా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో రాజరిక పాలన నడుస్తుంది. 2017 ముందు యూపీ లో ఇలాగే పాలన ఉండేది. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏంతో ఆనందంగా ఉన్నారు. కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారిని గెలిపించాలి. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి దశకు వచ్చింది. రామ మందిరం ప్రారంభోత్సంలో కల్వకుర్తి రామ భక్తులకు దర్శనం చేసుకుని అవకాశం కల్పిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే యూపీ తరహా అభివృద్ధి చేస్తాం.
brs candidate
ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ తరపున కాక తన సొంత డబ్బులతో కూడా తన సేవా కార్యక్రమంలో భాగంగా ఇల్లు నిర్మించి ఇస్తానని బిఆర్ఎస్ నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం లోని వెంకటాపూర్ గగ్గల పళ్లి గ్రామాలలో మర్రి జనార్దన్ రెడ్డి నేడు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మర్రి జనార్దన్ రెడ్డి వెంట నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తనయుడు నాగం శశిధర్ రెడ్డి లు పాల్గొన్నారు. ప్రచారానికి గ్రామాలలోని ప్రజలు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. గగ్గలపల్లి గ్రామంలో శివాలయంలో పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్న మర్రి గ్రామంలో ఎన్నికల ప్రచారం పై ప్రసంగించారు. కారు గుర్తుకే ఓటు వేసి, రైతు సంక్షేమ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను మర్రి జనార్దన్ రెడ్డి కోరారు. ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న ప్రేమను ఆయన ఓటర్లకు తెలియజేశారు. మంగళవారం నుండి రైతుబంధు పైసలు టింగ్ టింగ్ అంటూ రైతుల ఖాతాలోకి వస్తాయని ఓటర్లకు తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, వృద్ధాప్య పెన్షన్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పనివి కూడా చేసి చూపించిన బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కారు కోరారు . కారు గుర్తుకే ఈ నెల 30న ఓటు వేయాలని అందర్నీ మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు . మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారానికి ఆయన వెంట ర్యాలీగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. త్వరలో నాగర్ కర్నూల్ జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల పాలిటెక్నిక్ కళాశాలను కూడా తీసుకు వస్తానని బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు.
సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి సేవకుడు చింత ప్రభాకర్ కి మా మద్దతుతని జిల్లా వీరశైవ లింగాయత్ మాజీ అధ్యక్షులు ఏ సిద్దేశ్వర్, జిల్లా గౌరవ అధ్యక్షులు శివచంద్ర పాటిల్ అన్నారు. వీరశైవ లింగాయత్ సమాజం తరఫున శనివారం విలేకరుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. వీరశైవ లింగాయత్ అభివృద్ధి కోసం చింత ప్రభాకర్ పట్టణంలోని బసవ సేవా సదన్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం కృషి 50 లక్షలు నిధులు ఇవ్వడం జరిగిందని ఎడ్ల బజార్ బసవేశ్వర కళ్యాణ మండపానికి 40 లక్షల రూపాలు రావడానికి కృషి చేసిన చింత ప్రభాకర్ కే మా ఓటు అని తీర్మానం చేశామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాష్ట్ర వీర సేవా సమాజం భవనం కోసం కోక పేటలో కోట్ల విలువ చేసే ఎకరం స్థలం ఇవ్వడం జరిగిందని జిల్లా సమాజ భవనం కోసం కంది మండలంలో సుమారు ఐదు కోట్ల విలువ స్థలాన్ని కేటాయించడం జరిగిందని, అదేవిధంగా కేసీఆర్ బసవ జయంతిని అధికారికంగా నిర్వహించడం హర్షినియమన్నారు. నియోజకవర్గంలోని వీరశైవులందరూ చింత ప్రభాకర్ గెలుపు కోసం కృషి చేయాలని సమాజం తరఫున పిలుపునిచ్చారు. సమావేశంలో సమాజం జిల్లా కోశాధికారి చంద్ర కాంత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పపల్లి నర్సింలు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆత్మకూరు నాగేష్, జిల్లా నాయకులు మల్లికార్జున్ గందిగేరాజు శాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణ రాష్టాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుతారని అన్నారు కోరుట్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్. నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో మంద కృష్ణ మాదిగ తో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ 30 యేండ్ల నుండి కొట్లాడుతున్న వర్గీకరణ పై ఎ ఒక్క ప్రభుత్వం కూడా స్పందించలేదు. నరేంద్ర మోడీ స్పందించి వర్గీకరణ కు కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ లో బీసీ ని ముఖ్యమంత్రి చేస్తా అన్న పార్టీ బీజేపీ కాబట్టి అందరు కలిసి బీజేపీ కి ఓట్లు వేయాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లు ప్రజలను మోసం చేశాయన్నారు. అరవింద్ మాట్లాడుతూ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఉన్నారా ఉంటే విజిల్ వేయండి అంటూ అరవింద్ కూడ విజిల్ వేసి ఓటర్లను ఆకట్టుకున్నారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం లోని హస్తాల్పూర్., బండమీదిపల్లి, ముల్లూరు గ్రామం, పెద్దాపూర్ గ్రామం లో బిఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వస్తే పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకురావడం జరుగుతుందని మెదక్ జిల్లా నర్సాపూర్ బి ఆర్ ఎస్ అభ్యర్థి సునీత రెడ్డి అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం లో పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామాలకు బాగు లేని రోడ్లకు కొత్త రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. మహిళలందరికీ మహిళా సమాఖ్య భవనాలు కట్టడం జరుగుతుందన్నారు. సౌభాగ్య లక్ష్మి పేరుతో ప్రత్యేకంగా నెలకు 3000 ఇవ్వడం జరుగుతుందన్నారు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్యాస్ సిలిండరు 400 కు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి 15 లక్షల వరకు పెంచడం జరిగిందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అధికారమిస్తే దాంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు (శనివారం) వేములవాడ దద్దరిల్లనుంది. BJP అభ్యర్థి చెన్నమనేని వికాస్రావుకు మద్దతుగా 11AMకు సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రానున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కు మద్దతుగా 2PMకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభ జరగనుంది. మరుసటి రోజు (26న) BRS అభ్యర్థి చల్మెడకు మద్దతుగా KCR ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో BRS అభ్యర్ధి దుర్గం చిన్నయ్యకు శాసనసభ సర్వత్రిక ఎన్నికల ప్రచారంలో నిరసన జ్వలాలు ఎదురుకుంటున్నారు. 2014 లో జరిగిన ఎన్నికలు, తెలంగాణ సెట్టిమెంట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 2018లో ఎన్నికలు రెడోదాపా సంక్షేమ పథకాల,, అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగాలంటే మళ్ళీ గులాబీ పార్టీని గెలుపుంచాలన్న వాదం తో ప్రజల్లోకి వెళ్లారు కానీ 2023 శాసనసభ సర్వత్రిక ఎన్నికల్లో మూడో దాఫా విజయం పొందాలన్న ఆతృతతో గులాబీ తహ తహ లాడుతుంది కానీ అందుకు భిన్నంగా నియోజకవర్గల్లో అభ్యర్థుల పాలన పై అసంతృప్తి వెల్లువేత్తుతుంది భూ కబ్జాలు, ప్రభుత్వ భూములను ధరదాత్తం చేయడం, మౌలిక వసతులను సమాకుర్చడంలో విఫలం కావడం తో ప్రజల్లో ఆదరణ కరువైంది సొంత గ్రామాన్ని( జెండా వెంకట పూర్ ) అభివృద్ధి చేయకపోవడంతో గ్రామంలో వ్యతిరేక పావనాలు విస్తున్నాయి సొంత పార్టీ నాయకులు, ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీని విడారు , మరి కొందరు కౌన్సిలర్లు పార్టీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది రెండు పర్యాయలు గెలిచినా దుర్గం చిన్నయ్య హైట్రిక్ గెలుపు నల్లేరు మీద నడక అన్నట్లుగా మారింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదనీ ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదనీ, విచక్షణతోటి బాగా ఆలోచించి మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి ఓటెయ్యాలి. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఆషామాషీగా ఓటు వేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం మామిడిపల్లి, శ్రీనివాసుల గూడ, మొదళ్ళ గూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కు ఆయా గ్రామాల్లో ప్రజల నుండి భారీ స్పందన లభించింది. స్ధానిక నేత మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది.. ఏ పార్టీకి ఓటేస్తే చెడు జరుగుతది..? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయగలగాలనీ, ప్రజలకు ఉన్న ఒకే ఆయుధం ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలె’ అని అంజయ్య చెప్పారు. ‘పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలె. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఏందో మీకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ అభివృద్ధి కోసం. తెలంగాణ ఏర్పాటైనంక బీఆర్ఎస్ పార్టీ ఎంత బాగా అభివృద్ధి చేసిందో మీరందరూ చూస్తున్నరు. మరె 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది..? అడుగడుగునా తెలంగాణను మోసం చేసింది. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసిన కరువు కాటకాలే ఉండె. పత్తికాయలు పగిలినట్లు రైతులు గుండెలు పగిలి చనిపోయిండ్రు. అదీ కాంగ్రెస్ పరిపాలన’ అని అంజయ్య ఎద్దేవా చేశారు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం 10 సంవత్సరాల కాలం కుటుంబాన్ని వదిలేసి, అవమానాలు పడి పోరాటం చేసి తెలంగాణ ను సాధించిన వ్యక్తి కేసీఅర్ అని అలాంటి వ్యక్తికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరుకున్నారు రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి. బిఅర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామం లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఅర్ పాలనలో గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని, వెనకబడిన గ్రామాలు నేడు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందాయి అని కొనియాడారు. సీతారామ ప్రాజెక్ట్ తో జిల్లా సస్యశ్యామలం కానుందని వివరించారు. కేసీఅర్ ప్రవేశ పెట్టిన ప్రతి పథకం ప్రతి వర్గానికి ఉపయోగ పడుతుంది అన్నారు. జనవరి నుండి ప్రతి మహిళకు సౌబాగ్యా లక్ష్మి పథకం పేరుతో మూడు వేలును కేసీఅర్ అందించనున్నారు అని పేర్కొన్నారు. కార్ గుర్తుకు ఓటు వేసి బిఅర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరుకున్నారు.
Read Also…
Read Also…
భారీగా కార్యకర్తలను సమీకరించిన బిఅర్ఎస్ పార్టీ. అల్లపుర్ ,మూసాపెట్ , KPHB,బాలానగర్ మీదుగా రోడ్ షో.. రొడ్ షోలో పాల్గొన్న స్తానిక ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావు,స్థానిక కార్పొరేటర్లు Kphb లో కాంగ్రెస్ పార్టీ సీనయర్ నేత గొట్టుముక్కల పద్మారావు కెటిఆర్ అధ్వర్యంలో చేరిక మాధవరం కృష్ణ రావు కాబోయే ఎమ్మెల్యే..9 ఏళ్లలో మేము పని చేసింది ఆరున్నర సంత్సరలు మాత్రమే, కరొన తో కొంత కాలం పోయింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది .. ఏక్కడి ప్రాంతం వారైనా మాకు సమానమే కులం ,ప్రాంతం పేరుతో కేసీఅర్ ఎనాడు చూడలేదు ,పెట్టుబడి దారులకు స్వాగతం పలుకుతూ రాష్ట్ర అభవృద్ధి చేశాం. చెన్నై నుండి వచ్చిన రజినీ కి హైదరాబాద్ అభవృద్ధి కనపడింది ,కానీ ఇక్కడ గజిని లకు అర్థం కావడం లేదు.. కేటిఆర్ హైదరబాద్ లో ఐటి రంగం బాగుంటే వివిధ రంగాలు అభివృద్ధి చెంది ఉపాధి దొరుకుతుంది..కెటిఆర్ పెదవాల్లకు సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ఏర్పాటు చేశాం సౌభాగ్య లక్ష్మి ,కేసీఅర్ భీమ ,సన్న బియ్యం తో అన్నపూర్ణ పతకాలు కాంగ్రెస్ పార్టీ ఆయంలో ఉన్న తాగునీటి ,కరేంటు కష్టాలూ ఇప్పుడు లేవు. కెటిఆర్ హైదరబాద్ వాసులు పని చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తె తెలంగాణా పరిస్తితి కుక్కలు చింపిన విస్తరి లా ఉంటుంది..కెటిఆర్ మాధవరం కృష్ణ రావు ఒత్తిడితోనే కాపు ,కమ్మ ,క్షత్రియ సామాజిక వర్గాలకు భూమి కేటాయింపు..కెటిఆర్ కాంగ్రెస్ గతం బి అర్ ఎస్ భవిష్యత్తు





Total views : 62166