పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డ మంత్రి అంబటి…పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ సీఎం,సీఎం అని అంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం, చంద్రబాబు సీఎం అంటున్నాడు. ఎందుకంటే పవన్ కి క్యాష్ కొడితే వెళ్ళిపోతాడు.పవన్ కళ్యాణ్కు రాజకీయాలు తెలియవు. అతను రాజకీయాలకు పనికిరాడు. అతను నమ్మి వెళితే కుక్కతోక పట్టుకొని గోదారి వీధినట్టే… జగనే ఎందుకు మళ్ళీ సీఎం కావాలంటే,
సంక్షేమ కార్యక్రమాలు అమలు కోసం జగన్ రావాలన్నారు
chandrababu
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆయన విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. దీంతో, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ ఫేక్ ఎత్తుగడల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు చేసిన పని అని లోకేష్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఈ నకిలీ లెటర్ పై టీడీపీ కూడా మండిపడింది. రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టడమే సీఎం జగన్ నైజమని టీడీపీ విమర్శించింది. ఒక సామాజికవర్గ ప్రజలకు విజ్ఞప్తి’ అంటూ చంద్రబాబు పేరుతో నకిలీ లేఖను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టింది. జగన్కు ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ నకిలీ లేఖ చెబుతోందని విమర్శించింది.
సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించామని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. డి హిరేహాల్ మండలం సిద్దాపురం గ్రామంలో గో సిద్దేశ్వర దేవాలయన్ని సందర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు.
ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటి భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తూ “బాబు షురిటి – భవిష్యత్తు గ్యారెంటీ” పాంప్లెట్ల ను పంపిణీ చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలను అక్రమాలను అన్యాయాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలను వివరించారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిన టిడిపి నేత చంద్రబాబు నాయుడు కేవలం కక్షపూరితంగా అక్రమంగా జైల్లో పెట్టారని ఆవేదన చెందారు.
తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఇంటిలోనూ చదువుకున్న ప్రతి విద్యార్థుల కి 15000 రూపాయలు, మహాశక్తి పేరు తో మహిళలకు అనేక పథకాలు, సంవత్సరానికి మూడు సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు, ఇలా సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వడం జరుగుతుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇసుక కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది. ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చింది. ఈ నేపథ్యంలో, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే, విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు వాదనలకు కొంత సమయాన్ని (పాస్ ఓవర్) కోరారు. దీంతో, మధ్యాహ్నం పిటిషన్ ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. మరోవైపు, విధానపరమైన నిర్ణయాలకు నేరాలను ఆపాదిస్తున్నారని పిటిషన్ లో చంద్రబాబు పేర్కొన్నారు. 17ఏ ప్రకారం కేసు నమోదుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తప్పనిసరి అని చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ కంటి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది. ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ దాదాపు 2 గంటల సేపు కొనసాగింది. శస్త్ర చికిత్స ముగిసిన వెంటనే ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి బయల్దేరారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ ఆభిమానులు ఆసుపత్రికి వచ్చారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పలాస లో సామాజిక సాధికారిక యాత్ర లో మంత్రి ధర్మాన ప్రసాదరావు కామెంట్స్ గతం లో చిన్న చిన్న మార్పులకు ఉద్యమాలు చేసే వాళ్ళం.నాలుగున్నర సంవత్సారాలు బిన్నం గా పాలన జరిగింది. కిడ్నీ డిసీజ్ పై గతం లో చూసి వెళ్ళే వారు తప్ప దానికి పరిష్కారం చూపలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక పరిష్కారం చూపి శుద్ధ జలాలు పై అడుగులు వేసాం. 700 కోట్లతో త్రాగు నీరు ప్రాజెక్ట్ నిర్మించాం, 200 పడకల ఆసుపత్రిని నిర్మించాం. గతంలో అవినీతి అనేది చాలా ఎక్కువగా ఉంది. డి బి టి ద్వారా డైరెక్ట్ గా లబ్ధిదారులకు ఇచ్చి అవినీతి అరికట్టడం జరిగింది. చంద్రబాబు కూడా మేము అరికట్టిన అవినీతి పై మాట్లాడలేక పోయారు. అందుకే చంద్రబాబు నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అంటున్నారే తప్ప అవినీతి అని చెప్పలేదు. ఆఖరుకి ఆయన కూడా ఇదే తరహా లో నిధులు పంచుతామని అన్నారంటే జగన్ లాగా బాబు ఆలోచన చేయలేకపోయారు. ప్రజల జీవన ప్రమాణాలు లు పెంచడానికి ఆయన ఆలోచించలేదు. డబ్బున్న వారి కోసం వారి నీ ఎలా మరింత పెద్దలుగా పెంచాలని ఆలోచించరే తప్ప పేదల కోసం ఏమి చేయలేదు సమాజంలో ప్రజల ప్రమాణాలు పెంచడమే లక్ష్యం తో మేము వెళుతున్నాం రోడ్లు ఉంటే నే అభివృధి అనుకోవడం తప్పు ఓక ఇంటి వారు అభివృధి చెందందంటే కారణం విద్య, వైద్యం, సొంత ఇళ్లు ఉంటే అది అభివృధి ఇల్లు లేని ప్రతి వాళ్ళకి ఇల్లు ఇచ్చాము చంద్రబాబు ఇటువంటి ఆలోచించలేదు చంద్రబాబు ఎంతసేపు రాజధాని అనుకున్నాడు. అతనికి కావలసిన ప్లేస్ లో రాజధాని మాత్రమే పెట్టుకున్నాడు. తన కావాల్సిన వాళ్ళతో రాజధాని పక్కనే భూములు కొనిపించుకున్నాడు. 2014 లో 23 సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో రెండు సంస్థలు రావాలి అందులో యూనివర్సిటీ, రీసెర్చ్ సెంటర్ గానీ రావాలి. ఒక్కటి కూడా రాలేదు ఆయన శ్రీకాకుళం అంటే ప్రేమంటారు ఎక్కడ ప్రేమ. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేశారు శ్రీకాకుళం ప్రాతం లో ఎన్నోసార్లు గెలిపించారు ఏమి చేయలేదు బాబు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలని చూస్తున్నారని ఇప్పుడు అంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఏమి చేసావు బాబు. ఇప్పుడు మోసపు మాటలు మాట్లాడుతున్నారు. 4,700 కోట్లతో మూలపెట లో పోర్ట్ వస్తోంది. ఈ ప్రాంతం అంటే జగన్ కు ప్రేమ. జగన్ సైకో అతను వస్తే ఇక్కడ దోపిడీ అంటున్నారు. మనం చూస్తున్నాం పాలన ఎలా ఉందో అర్థం చేసుకోండి. యువత ముఖ్యం గా వినాలి మనం ఏమి చేస్తున్నామో అందరికీ చెప్పాలి.
త్వరలో టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశం కానున్నారు. విజయవాడలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. సమావేశానికి చంద్రబాబు హాజరు అయ్యేందుకు టీడీపీ న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. ఒకవేళ న్యాయ నిపుణులు అభ్యంతరం చెప్పకపోతే బాబు సమావేశానికి హాజరు అయ్యే అవకాశం ఉంది.
Read Also..
గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మద్యం అమ్మకాలలో అవినీతి జరిగిందని నాలుగున్నర సంవత్సరాల తర్వాత జగన్ రెడ్డి ఎన్నికల ముందు కేసు పెట్టడాన్ని తప్పుపట్టారు. ప్రివిలేజ్ ఫీజు తగ్గించారని అబద్ధపు ఆరోపణలు చేసి జగన్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నాడు అన్నారు. ప్రివిలేజ్ పీజీకి సంబంధించి మద్యం వ్యాపారుల విజ్ఞప్తిని నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని, దానివల్ల రాష్ట్ర ఖజానాకు 1800 కోట్ల ఆదాయం వచ్చింది అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులను దొంగతనం చేయడమే కాకుండా, దొంగ కేసులు బనాయించి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బందులు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఎక్కడా దొరకని కల్తీ మద్యం అమ్ముతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, 24 వేల కోట్లు దిగమింగిన జగన్ రెడ్డి, తెలుగుదేశం ప్రభుత్వంపై నిందలు వేస్తూ, జగన్ రెడ్డి చేస్తున్న మద్యం దోపిడీని ప్రజలకు తెలియకుండా చేయాలని కుట్ర పన్నాడు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మద్యంపై జగన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులకు న్యాయస్థానంలో పోరాడడానికి మేము సిద్ధం! రాష్ట్రంలోని మద్యం అమ్మకాలు, తయారీ, సరఫరా,డిస్లరీల పై జగన్ రెడ్డి సిబిఐ విచారణ జరిపించగలరా అని సవాల్ విసిరారు. చంద్రబాబు గారికి బెయిల్ తద్యమని తెలియడంతో అప్పటికప్పుడు మద్యం టెండర్లులో ఏదో జరిగిందని దొంగ కేసు పెట్టాడు అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరు అవినీతిపరులో గమనిస్తున్నారని, వైసీపీని, జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
చంద్రబాబుకు కండీషనల్ బెయిల్ మాత్రమే ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్ రాగానే టీడీపీ సంబరాలు జరుపుకోవడంలో అర్థం లేదని మండిపడ్డారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉందన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను విచారిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయిని తెలిపారు. మధ్యంతర బెయిల్ రాగానే నిజం గెలిచినట్టా అని సజ్జల ప్రశ్నించారు. బెయిల్ రాగానే నిజం ఎక్కడ గెలిచినట్లు అని… ఇది విజయోత్సవాలు జరుపాల్సిన సందర్భమేనా అంటూ ప్రశ్నించారు. చికిత్స చేయించుకోవడానికి మాత్రమే చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు. చంద్రబాబు జైలులో ఉన్నా .. బయట ఉన్నా ఒకటే అని వ్యాఖ్యానించారు. చిన్న వ్యాధిని కూడా పెద్దగా చూపించి … సానుభూతి పొందే ప్రయత్నం చస్తున్నారని అన్నారు. నిజంగా చంద్రబాబు అనారోగ్యంగా ఉంటే చికిత్స చేయించుకోవాలని అన్నారు. చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందేనని చెప్పారు.





Total views : 89850