కాకినాడ జిల్లా, అంగన్వాడీల పై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రకటించిన మేము భయపడేది లేదు ఆనాడు తమిళనాడు ప్రభుత్వం ఎస్మా ప్రకటించింది ఆ ప్రభుత్వం కనుమరుగయ్యింది. త్వరలో జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితి ఎదుర్కొంటాడు. కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ లు నైట్ కూడా దిక్షలు నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతాం అని ప్రభుత్వానికి అంగన్వాడీ లు హెచ్చరిస్తున్నారు.
cvr om
భార్యతో కలిసి కన్న తల్లిని హత్య చేసిన దుర్మార్గుడు. బంధువులకు అనుమానం రావడంతో బయటపడిన విషయం. ఆస్తి అమ్మడానికి అడ్డు వస్తుందని కన్నతల్లినే భార్యతో కలిసి మట్టు పెట్టాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ వెంకట్ రెడ్డి నగర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
వెంకట్ రెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన కసావేణి సుగుణమ్మ భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు ఆమెకు కుమారుడు అనిల్ ,కోడలు తిరుమల ఉన్నారు
వీరి ఇద్దరు పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు, భర్త చనిపోయిన తర్వాత ఇంటిని సుగుణమ్మ తన పేరు మీదకు మార్చుకుంది కొడుకు జులాయి గా తిరగడంతో అప్పులు పెరిగాయి, అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మాలని కొడుకు, కోడలు కొంతకాలంగా సుగుణమ్మ పై ఒత్తిడి చేస్తున్నారు అయితే సుగుణమ్మ ససేమీరా అనడంతో కోడలుతిరుమల పుట్టింటికి వెళ్ళింది ఇల్లు అమ్మాలంటే ఎలాగైనా తల్లి అడ్డు తొలగించుకోవాలని అనిల్ నిర్ణయించుకున్నాడు ఈ నెల నాలుగవ తేదీ అర్ధరాత్రి తిరుమల మరో వ్యక్తి శివతో కలిసి వెంకటరెడ్డి నగర్ వచ్చింది అదే రాత్రి సుగుణమ్మ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు, అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న సుగుణమ్మ ముఖంపై దిండు అదిమి గొంతు చుట్టి హత్య చేశారు అమ్మ నిద్రలోనే చనిపోయిందని అనిల్ బంధువులతో బుకాయించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో బయటపడ్డ అసలు నిజం. మరణ వార్త విని సుగుణమ్మ తల్లి దాసరి ఐలమ్మ సహా బంధువులు వరంగల్ ప్రాంతం నుంచి భారీగా తరలివచ్చారు 5వ తేదీన అంత్యక్రియలకు సన్న హాలు చేశారు సుగుణమ్మ మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడమీద గాయాలు కనిపించాయి దీంతో అనుమానం వచ్చి బంధువులు అనీలు నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు కొడుకు, కోడలిని అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం బయటపడింది. ఆస్తి కోసం అమ్మను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని భార్య ఆమెతో వచ్చిన శివతో కలిసి హత్య చేసినట్లు అనిల్ పోలీసులకు తెలిపాడు దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
నెల్లూరు జిల్లా, గుడ్లూరు (మం) మాచర్ల వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీ కొట్టిన TSRTC బస్సు ఒకరు మృతి, 7గురి పరిస్థితి విషమం. మృతి చెందిన వ్యక్తి బస్ డ్రైవర్ వినోద్ గా గుర్తింపు. మిర్యాలగూడ నుండి తిరుపతి వెళ్తున్న TSRTC బస్సు. క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాల లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలింపు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న పోలీసులు.
తిరుపతి, ఉమ్మడి నెల్లూరు జిల్లా, గూడూరు జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత అర్ధరాత్రి మున్సిపల్ కార్మికుల బైటాయింపు. కార్మికులు సమ్మెలో ఉండగా పర్మనెంట్, ప్రైవేట్ కార్మికులతో అర్ధరాత్రి చెత్త తీపిస్తున్న అధికారులు. అడ్డుకున్న మున్సిపల్ పారిశుధ్య ఔట్ సోర్సింగ్ సిబ్బంది. అధికారులు, పోలీసులుతో పారిశుద్ధ్య కార్మికుల వాగ్వాదం. నెల్లూరు నగరంలోనూ ఇదే పరిస్థితి. రోజు రోజుకూ ఉధృతం అవుతున్న కార్మికుల సమ్మె.
అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. సమ్మె పై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించిన ప్రభుత్వం. అత్యవసర సర్వీస్ లు క్రిందకు తీసుకొస్తూ GO జారీ. ఆరు నెలలు పాటు సమ్మె నిషేధం. అత్యవసర సర్వీస్ లు క్రిందకు రాని అంగన్వాడీల సేవలు. పౌష్టికాహారం సరఫరా చేసే ప్రక్రియ దృష్యా అత్యవసర సర్వీస్ ల క్రిందకు తీసుకువచ్చిన ప్రభుత్వం. GO నంబర్ 2 ను విడుదల చేసిన ప్రభుత్వం.
మందస మండలం రట్టిలో ఎలుగు బంటి సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. రట్టి గ్రామానికి సమీపంలోని తోటలో అలజడి చేసిన ఎలుగుబంటిని చూసిన గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు. రట్టిలో ఆహార అన్వేషణ కోసం ఎలుగుబంటి పుట్టను త్రవ్వి హల్ చల్ చేసింది. అటు ఇటు తిరుగుతూ కాసేపు చక్కర్లు కొట్టిన ఎలుగుబంటి నెమ్మదిగా జారుకుని సమీపంలోని జీడి తోటల్లోకి పారిపోయింది. రట్టి సమీపంలోని కొండల నుంచి ఎలుగు బంట్లు గ్రామాల్లోకి చొరబడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులు స్పందించి భల్లూకాలు జనవాసాల్లోకి రాకుండా శాశ్వత చర్యలు తీసుకొని ఎలుగుబంట్ల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
గుంటూరు ఎంపీ ఎన్నికల బరిలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నియామకం చేసేందుకు వైసీపీ కసరత్తు. ఎంపీ మార్పు పై ఆసక్తి చూపని నరసరావు పేట పార్లమెంట్ ఎమ్మెల్యేలు. నరసరావు పేట ఎంపీ స్థానాన్ని బిసి వర్గాలకి ఇస్తే అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించవచ్చని వైసీపీ అధిష్టానం యోచన. సీఎం జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు. నరసరావు పేట పార్లమెంట్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు. గుంటూరు పార్లమెంట్ కి వస్తే తాడికొండ, మంగళగిరి లాంటి నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగ తగులుతుందని ఎంపీ ఆలోచన. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఎలాంటి మార్పు జరుగుతుందా అని వైసీపీ కింది స్థాయి నేతల్లో ఆసక్తి నెలకొంది.
కేశినేని రాజీనామా నేపద్యంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన PVP. ట్విట్టర్ లో నాని రాజీనామా పోస్ట్ ను షేర్ చేస్తూ విమర్శలు చేసిన పీవీపీ. కేశినేని నాని పిప్పళ్ల బస్తా, బెజవాడకే గుదిబండలా తయారయ్యావు. ఏదో మచ్చేసుకుని పుట్టావు, పార్టీలో పదేళ్లు బండి కొనసాగించావు. బ్యాంకులను బాదావు, జనాలని ఉద్యోగులని పీల్చి పిప్పి చేశావు. ఇకనైనా ఒట్టిమాటలు కట్టి పెట్టి, అన్ని మూసుకొని మూలపడుండు పుండాకోర్.!! అంటూ తీవ్ర స్దాయిలో విమర్శలు గుప్పించిన పీవీపీ. 2019 ఎన్నికల్లో నానిపై పోటి చేసిన పీవీపీ. వైసీపిలో పీవీపి కొనసాగనప్పటికి ఐదేళ్లుగా నాని విషయంలో మాత్రం విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు.
అమరావతి, గుంటూరు – విజయవాడ వారధిపై హిట్ అండ్ రన్. స్కూటీ పై వెళ్తున్న మహిళలను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదంలో ఇద్దరు మహిళలు స్పాట్ డెడ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కృష్ణ లంక పోలీసులు. గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన మహిళలుగా గుర్తింపు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు. గుంటూరు నుండి విజయవాడ వస్తుండగా ప్రమాదం. ఢీ కొట్టిన వాహనం కోసం సీసి కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు.
కడప జిల్లా, కాజీపేటలో 300 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరిక. వైకాపా ఎంపీటీసీ చంద్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో టీడీపీలోకి చేరికలు. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి కావాలని సొంత పార్టీ ఎంపీటీసీ అడిగితె సస్పెండ్ చేసిన ఘనత వైకాపా కు చెందుతుంది. వైకాపా ఎంపీటీసీనే చేరుతున్నారంటే వారి అరాచకం అర్ధం అవుతుంది. రాష్ట్రానికి అభివృద్ధి కావాలి సంక్షేమం కాదు. అభివృద్ధి లేకుండా సంక్షేమం పనికిరాదు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని రాత్రికి రాత్రే అరెస్టు చేస్తారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. నియంత పాలన ఎక్కువ రోజులు ఉండదు. మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి కి దోచుకోవడం తప్పితే అభివృద్ధి చేయడం తెలియదు. శాసనసభ్యుడు రఘురామిరెడ్డికి సంక్షేమానికి, అభివృద్ధికి తేడా కూడా తెలియదు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం అని వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరుతున్నారు. తెలుగుదేశం లోకి స్వచ్ఛంగా చేరుతున్న వైసీపీ పార్టీ అధికార నాయకులు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. కాజీపేట మండలం అభివృద్ధిలో వెనకబడి ఉంది అని వెల్లడించారు.



Total views : 90074