ఖైరతాబాద్ నియోజకవర్గంలో బిజెపి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆ పార్టీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి కాలనీలు, బస్తిలలో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఐదేళ్ళపాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను చేసిన సేవలే గెలిపిస్తాయంటున్న బిజెపి అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి.
fans
గుజరాత్ లోని అహ్మదాబాద్లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగబోతుంది. దేశం మొత్తం క్రికెట్ ఫివర్తో ఊగిపోతోంది. ఎటుచూసినా టీమిండియా గెలవాలన్న నినాదామే వినిపిస్తోంది. టీమిండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్ జట్టు గెలవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని దత్తసాయి ఆలయంలో క్రికెట్ అభిమానులు పూజలు చేశారు. జాతీయ జెండాలు చేత పట్టి ఇండియా జట్టుకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పూజలు, హోమాలు, యాగాలు చేస్తూ టీమ్ ఇండియా ఫైనల్లోకి ప్రవేశించడంతో ఈసారి కప్పు రావడం ఖాయమని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిలబడటానికి ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. ఛాతీ భాగాన్ని కూడా రెండు, మూడు సార్లు నొక్కుకున్నారు. అనంతరం ఆమె వాహనంపై పడిపోయారు. వాహనంపైనే ఆమెను పడుకోబెట్టి సపర్యలు చేశారు. కవిత పడిపోవడంతో అక్కడున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికి ఆమె కోలుకున్నారు. అయితే, ఆమె డీహైడ్రేషన్ తో అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.
Read Also..
Read Also..