పిస్తాపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ B6 మరియు థయామిన్తో సహా వివిధ పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి.ఆయుర్వేదంలో, పిస్తాపప్పులు శరీరం, మనస్సుకు ,మెదడు పనితీరును మెరుగుపరచడానికి ,మొత్తం శరీర శక్తికి సహాయపడతాయి. గట్, కంటి , రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. డయాబెటిస్తో బాధపడుతున్న చాలా మంది ఆరోగ్యకరమైన అల్పాహారాలను తీసుకోవటానికి ఇష్టపడతారు. ఇవి కడుపును నిండుగా ఉంచటంతోపాటు, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. టీ తీసుకునే సమయంలో రుచికరమైన, పోషక విలువలు కలిగిన పిస్తాపప్పులను తీసుకోవచ్చు. పిస్తాపప్పులు కరకరలాడుతూ, వగరుగా , కొద్దిగా తీపిగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి సరైన చిరుతిండిగా నిపుణులు సూచిస్తున్నారు. పిస్తాపప్పును వంటకాలలో రుచి కోసం ఉపయోగించవచ్చు.
Fats
రాత్రివేళల్లో చాలా మంది ఎక్కువగా తింటారు. తిన్న వెంటనే పడుకుంటారు. దీనివల్ల తొందరగా బరువు పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవాళ్లు రాత్రి సమయంలో మితంగా తినాలి. అన్నం బదులు స్నాక్స్ వంటివి తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. డైటింగ్ చేస్తున్నప్పుడు సలాడ్స్, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి ఆకలి నియంత్రిస్తాయి. పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. వీటిలో అధిక కేలరీలు ఉంటాయి. కాబట్టి పండ్లను ఎక్కువగా తినాలి. నెమ్మదిగా తినడం, ఎక్కువగా నమిలి తినడం వంటివి అలవాటు చేసుకోవాలి. ఫోన్ మాట్లాడుతూ టీవీ చూస్తూ తినడం వల్ల ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. కాబట్టి ఆ అలవాట్లకు దూరంగా ఉండాలి. పండ్లు, ఆకుకూరలు తినడం మంచిదే. అలా అని ఎక్కువ తిన్నా కూడా తొందరగా బరువు పెరుగుతారు. ఎప్పుడూ 20 శాతం కడుపు ఖాళీగా ఉంచుకునేలా చూసుకోవాలి. ముఖ్యంగా త్వరగా జీర్ణమయ్యే పండ్లను తీసుకోవడం ఉత్తమం. అరటి పండ్లు తొందరగా జీర్ణమవుతాయి. కాబట్టి బరువు పెరిగే అవకాశమే ఉండదు. అలాగే దోసకాయ, క్యారెట్, బీట్రూట్ వంటివి తినడం కూడా మంచిది. వీటితో పాటు శనిగలు తీసుకోవడం కూడా ఉత్తమమే. వీటిలోకార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లతో పాటు బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియకు బాగా సహకరించి బరువును తగ్గిస్తాయి.
లూటీ కోసమే వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని, ఆర్ధిక వ్యవస్థను ఊబిలోకి నెట్టిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం క్లాసిక్ డెట్ ట్రాప్లోకి వెళుతోందని, నాలుగేళ్లుగా ఏకరవు పెడుతున్నా ప్రతిపక్షాలపై విరుచుకుపడడం తప్ప ఏమాత్రం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదన్నారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించకుండా పదేపదే అబద్దాలను వల్లెవేస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్, క్రిసిల్ లాంటి సంస్థలు తీవ్రంగా హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఏడాది ఆగష్టు నెలలో డాయిష్ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ దాస్ తన నివేదికలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్లో ఏపీ 8వ స్థానం నుంచి 11వ స్థానానికి పడిపోయిందని చెప్పారన్నారు. క్రిసిల్ రేటింగ్ సంస్థ అమరావతి బాండ్ల రేటింగ్ను తగ్గించిందని, చేబదుళ్లు, ఓవర్ డ్రాప్ట్లతోనే ఆర్థిక నిర్వాహణ చేసే స్థితికి దిగజారిందన్నారు. జగన్ రెడ్డి దోపిడీ, దుబారాల వల్లే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వ గ్యారెంటీలతో కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల సమాచారం కాగ్ అడిగినా ఆ లెక్కలు వెల్లడించడం లేదని మాజీ మంత్రి యనమల ఆరోపించారు.