గత నెల 26వ తేదీ నుండి మూడు ప్రాంతాలనుండి మూడు రథాలు ఎక్కి జగనన్న కటౌట్ పెట్టీ బస్ యాత్ర చేస్తేనే జన సంద్రంగా మారింది. సైకిల్ తుప్పు పట్టింది,గ్లాసు పగిలిపోయింది. పావలా కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. చంద్రబాబు జైల్ నుండి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయాడు. సామాజిక న్యాయం గురించి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడలేదు. నలుగురు వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని రాజ్యసభ సభ్యులను చేసింది జగనన్న స్పీకర్, చైర్మన్ స్థానాలలో వెనుకబడిన వారిని కూర్చోబెట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది. చంద్రబాబు పాలేరు పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ చెంచా నాదెళ్ల మనోహర్ ప్రెస్మీట్ పెట్టీ విద్యా కానుక కిట్ ఇవ్వడం తప్పు అంటాడు. తప్పో కాదో ప్రజలే చెప్పాలి. పేదవారిపై వీరంతా కక్ష కట్టారు.
jagan
సభ లో ప్రజల్ని చూస్తుంటే నాగావళి వంశధార నదులు పోటెత్తియా అన్న రీతిలో ఉంది కృష్ణదాసు జగనన్నకు అభిమాన దాసుడు .. అట్టడుగు వర్గనికి చెందిన నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నానంటే కారణం జగన్.. 1,12,795 కోట్లు సంక్షేమ ఫలాలను పేదలకు అందించాం.. 25 వెలు కోట్ల రూపాయలు గిరిజనుల కోసం ఖర్చు చేశాం.. రాష్ట్రం లో 151 సీట్లు గెలిచిన మనం 175 సీట్లు ఈజీగా గెలుస్తాం .. శ్రీకాకుళం లో మూలపేట పోర్ట్, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శుద్ధి జలాల నీటి అందించడం మా ప్రభుత్వ ఘనత.. నాలుగు సంవత్సరాలలో రూపాయి లంచం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించాం.. గతంలో ఏ ప్రభుత్వం కూడా అట్టడుగు వర్గాల అభివృద్ధికి చూడలేదు… ఎప్పుడూ అణగదొక్కాలని చూశారు.. కానీ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ పదవులు ఇచ్చిన ఘనత మనదే.. 2024 లో జగనన్న గెలుపు వన్ సైడ్ , టిడిపి సూసైడ్, జనసేన ఔట్ సైడ్ ఇది రాష్ట్ర ప్రజలు డిసైడ్..
పల్నాడు ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన వ్యక్తుల్లో తాను కూడా ఒకరినని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. కృష్ణమ్మ ఒడ్డునే ఉన్నప్పటికీ మాచర్లకు కృష్ణమ్మ నీళ్లు అందని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ క్రమంలో పల్నాడుకు వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు అవసరం ఎంతుందనేది తెలిసిన అతికొద్దిమందిలో తానొకడినని చెప్పారు. దశాబ్దాలుగా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు.
నీటి వృధా పై సమగ్ర స్థాయిలో విచారణ జరిపేందుకు చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. సాగునీటి సలహా మండల సమావేశానికి వచ్చే రైతుల పట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారంటూ దుయ్యబట్టారు. నియోజకవర్గంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సైతం నిధుల లేమితో నిలిచిపోయాయన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి రైతులను ఆదుకోవాలన్నారు.
Read Also..
Read Also..
జగన్కు రంగులపైనా, పేర్లపైనా ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదు – యనమల రామకృష్ణుడు
ఏపీ సీఎం జగన్కు రంగులపైనా, పేర్లపైనా ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం కేటాయిస్తున్న నిధులను అవినీతి, దుబారా కార్యక్రమాలకు దారిమళ్ళించి ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. 94కు పైగా కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయకపోవడంతో నాలుగేళ్లలో వేలకోట్ల రూపాయలను రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం నుంచి ఆరోగ్యశాఖ వరకు, పరిశ్రమల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు ఇలా ప్రతి రంగానికి కేంద్రం విడుదల చేస్తున్న నిధులన్నింటినీ దారి మళ్లించడమే ఎజెండాగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఈ నాలుగున్నరేళ్లలో రూ. 71,449 కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే దారిమళ్ళించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలు అంతా బోగస్ అని టిడిపి ఏలూరు ఇంచార్జ్ బడేటి చంటి విమర్శించారు ఏలూరు పవర్ పేటలోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ.. ఏలూరులో జగనన్న ఇళ్ల నిర్మాణాల కాంట్రాక్టర్ లబ్ధిదారుల వద్ద నుండి కోట్లాది రూపాయలు దండుకొని పరారయ్యడని ఆయన ఆరోపించారు..తన స్వార్థం తప్ప ప్రజలకు మంచి చేసే అలవాటు లేని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని మరోసారి ఎన్నికల ముందు తన విన్యాసాలు చూపుతున్నారని, అయితే ఆయన మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు లేరని ఏలూరు టిడిపి ఇన్చార్జి బడేటి చంటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ ఫేక్ ఎత్తుగడల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు చేసిన పని అని లోకేష్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఈ నకిలీ లెటర్ పై టీడీపీ కూడా మండిపడింది. రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టడమే సీఎం జగన్ నైజమని టీడీపీ విమర్శించింది. ఒక సామాజికవర్గ ప్రజలకు విజ్ఞప్తి’ అంటూ చంద్రబాబు పేరుతో నకిలీ లేఖను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టింది. జగన్కు ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ నకిలీ లేఖ చెబుతోందని విమర్శించింది.
ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటి వెళ్లనున్నారు. సీఎం జగన్ పలు వివాహ వేడుకల్లో పాల్గోనున్నారు. జగన్ ఆ తర్వాత పులివెందులలో శ్రీకృష్ణుడి ఆలయం, శిల్పారామాన్ని ప్రారంభించనున్నారు. రాత్రికి ఇడుపులపాయ లో వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్హౌస్లో బస చేసి రేపు ఉదయం 8.30కు ఇడుపులపాయలో ఆర్ కే వ్యాలీ పోలీస్ స్టేషన్ను ప్రారంభించి రేపు మద్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్పై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రావణ్కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. ప్రతివాదులు జగన్, సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు ఇచ్చింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నోరు విప్పాలని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సీఎం జగన్ గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలోని రోడ్ల గురించి పట్టించుకోలేదని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శించారు. జగన్ పాలనపై తెలంగాణ సీఎం, మంత్రులు కూడా హేళన చేస్తున్నారన్నారు. రాష్ట్రం పరువును జగన్ రోడ్డున పడేశారని అన్నారు. ప్రజల అవస్థలను జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.





Total views : 90068