ఈ మంత్రి హరీష్ రావు గారు సందర్బంగా మాట్లాడుతు సిద్దిపేట ప్రజలే ప్రచారకులు ప్రజల ఆలోచన లు ప్రజల మనసు లోని కోరుకునే అభివృద్ధి కళ్ళముందు ఉంచాను ఆశీర్వదించండి. సిద్దిపేట ప్రజల ఆలోచన అభివృద్ధి పరీక్ష వ్రాసాను ఎన్ని మార్కులు వేస్తారో మీ నిర్ణయం ఎన్నికలప్పుడు వచ్చేది. ఎవరు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండేది ఎవరు సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. సిద్దిపేట పేరు ప్రతిష్ట ను గౌరవాన్ని పెంచుకున్నాం. మరింత నిలబెట్టుక్కనేది ప్రజల ఆలోచన ఏడవసారి బి ఆర్ ఎస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశాను. సిద్దిపేట ప్రజల ఆశీర్వాదం తో మంచి మెజార్టీ తో గెలిపించండి. ప్రతిరోజూ మీ కోసం 18గంటలు కష్టపడ్డ. మీ కష్ట సుఖల్లో ఉన్న సిద్దిపేట ప్రజలు నా కుటుంబ సభ్యులు ఆరు సార్లు అద్భుత విజయం అందించి సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఐదేళ్లు కష్టపడి పనిచేశా మీ ఆత్మా సాక్షిగా నాకు మార్కులు వేయండి. సిద్దిపేట ప్రజలు కోరుకున్న పనులే కాకుండా కోరని ఎన్నో పనులు చేశా. ఆనాడు తెలంగాణలో కరువు కాటకాలు, ఆకలి చావులు, వలసలు ఉండేవి. నేడు రాష్ట్రాన్ని కెసిఆర్ రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 24లక్షల ఉద్యోగాలు, ఐటీ లో 6లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో లక్ష 80వేల ఉద్యోగాలు కల్పించాం. కొంతమంది ప్రక్క రాష్ట్రం నాయకులు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, వారు ఇక్కడ ఎం చెప్పదలచుకున్నారు ,ఓటు అడిగే నైతికత లేదు. దేశానికి దిక్సూచిగా తెలంగాణ ను కెసిఆర్ తీర్చిదిద్దారు. కెసిఆర్ పై సెన్సేషన్ ల్ కామెంట్స్ కోసం నోరు జారీ మాట్లాడుతున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటాదో కెసిఆర్ చేతుల్లో కూడా రాష్ట్రం అలాగే ఉంటది. నమ్మిన నాయకుడు కెసిఆర్ నీ కాదని ఇతర పార్టీలకు ఓట్లు వేయద్దు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేస్తే 10ఎండ్లు తిరిగి వెనుకకు రాష్ట్రం పోతుంది. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపి వాళ్ళు అభివృద్ధి చేయలేదు. సిద్దిపేట ప్రజలపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.
Kcr
ఐదవ సారి నామినేషన్ దాఖలు చేశాను . రాజకీయంగా జన్మనిచ్చి విదేశాల్లో గుర్తింపు నిచ్చింది సిరిసిల్ల. సిరిసిల్ల ప్రజల ప్రజా ప్రతినిదిగా చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను. 15 ఏండ్ల గా అవినీతి రహితంగా పని చేసినం.. సిరిసిల్ల ముఖ చిత్రం మార్చిన.. పల్లెలు పచ్చ బడ్డాయి.. వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న మీ బిడ్డగా రాష్ట్ర స్థాయి లో గౌరవం పెరిగింది. అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నాను. గౌరవ ప్రదమైన మెజారిటీతో గెలిపిస్తారాని నమ్ముతున్న గులాబి దండు నాకు అండగా ఉంది. ఇంటింటికి ప్రగతి నివేదిక పంపుతున్న 55 ఎండ్లు అధికారం ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్ కు ఓటు వేస్తారు. సంక్షేమం అభివృద్ధి చేసిన నన్ను గెలిపిస్తారా..! ఒకే ఒక గొంతుకను అనిచి వేయాలని రాహుల్ గాంధీ వస్తున్నాడు. మనకు మనకు ఏమన్న ఉంటే మనం మనం పరిష్కరించు కుందాం. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకనాటి సామంత రాజ్యంగా కావాలా.. కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా ..నీళ్ళు కావాలా.. కన్నీళ్లు కావాలా.. స్కాములు కావాలా సంబంధ వర్గాల అభ్యున్నతికి బిఆర్ఎస్ కుల మత పిచ్చి గాల్లను గెలిపిద్దమ్మ ఆలోచించండి. జిల్లా తెచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. నేతన్నల తలరాతలు మార్చాం. ప్రలోబాలకు లొంగీ పోతే ఆగం ఐతం. గతంలో తప్పు చేస్తే మళ్ళీ 50 ఎండ్లు బడపడ వలసి వస్తది. మళ్ళీ డిల్లీ మొచేతి నీళ్ళు తాగే పరిస్తితి వస్తది. సిరిసిల్ల ప్రజలు చైతన్య వంతమైన ప్రజలు. సిరిసిల్ల ప్రజల కోసం పనిచేసిన నన్ను మళ్ళీ భారీ మెజారిటీతో గేలిపిస్తారని విశ్వాసం ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు తమ నియోజకవర్గాల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు గజ్వేల్లో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం కామారెడ్డిలో బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.గజ్వేల్ లో ఐవోసీ మైదానం వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సీఎం వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ లో గజ్వేల్ చేరుకుంటారు. అనంతరం గజ్వేల్ నుంచి హెలికాప్టర్ లో కామారెడ్డి చేరుకొని నామినేషన్ వేస్తారు. అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం ముగింపు సభ సీఎం గారితో గజ్వేల్ లో ఈనెల 28 తారీకు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.2014, 2018 లో కూడా ముగింపు సభ గజ్వేల్ లో జరిగింది.
అనంతరం గజ్వేల్ నుండి హెలికాప్టర్ లో కామారెడ్డి చేరుకొని నామినేషన్ వేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం ముగింపు సభ సీఎం గారితో గజ్వేల్ లో ఈనెల 28 తారీకు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. 2014, 2018 లో కూడా ముగింపు సభ గజ్వేల్ లో చేసుకున్నాం రాష్ట్రంలో అద్భుతమైన విజయం సాధించాం. అప్పుడు అదే ఆనవాయితీ కొనసాగించబోతున్నాము. కెసిఆర్ కు ఓటు వేసి రుణ తీర్చుకునేందుకు గజ్వేల్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన హామీలే కాదు ప్రజలు కోరని పనులను కూడా గజ్వేల్ లో సీఎం పూర్తి చేశారు. కరువు పీడిత ప్రాంతమైన గజ్వేల్ నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమయ్యింది. గతుకుల గజ్వేల్ ను బతుకుల గజ్వేల్ గా మార్చింది కేసీఆర్. విద్యాలయాలకు, రిజర్వాయర్లకు నిలయంగా మారింది గజ్వేల్. దేశ విదేశ ప్రతినిధులు గజ్వేల్ కు వచ్చి ఇక్కడ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారు. కోకాకోలా, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్స్ రావడం వల్ల ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. గజ్వేల్ చరిత్రలో రానటువంటి రికార్డు మెజారిటీ ఈసారి కేసీఆర్ గారికి రాబోతున్నది. లక్షలకు పైగా మెజారిటీతో గజ్వేల్ లో గెలిచి తీరుతాం. కొందరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పెద్దవాళ్ల మీద పోటీ చేస్తే పెద్దవాళ్ళం అవుతామని అనుకుంటున్నారు. కేసీఆర్ కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరు. జీవితాన్ని ఫణంగా పెట్టీ తెలంగాణ సాధించారు. ఇంకెవరు పోటీ వచ్చినా అది నామ మాత్రమే కెసిఆర్ మా ముఖ్యమంత్రి అని గజ్వేల్ ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. వేరే వాళ్ళు ఉంటే ఆ గౌరవం గజ్వేల్ కు ఉంటుందా. పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కిరాయి మనుషులను తెచ్చుకొని షో చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడినుండి నిన్న జనం వచ్చారో ప్రజలందరికీ తెలుసు. మా పార్టీ కుటుంబ సభ్యులే 25 వేల మంది దాకా ఉంటారు. నీళ్లు పట్టుకునే మంచినీళ్ల బిందెలో, పండిన ప్రతి గింజలో కెసిఆర్ కనిపిస్తున్నాడని ప్రజలు చెబుతున్నారు. తెలంగాణ ద్రోహులంతా రాష్ట్రంలో ఏకమవుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు నేడు కాంగ్రెస్, బిజెపి రూపంలో తెలంగాణపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఆగం అవుతాం. దయ్యాల పాలు చేసినట్లు అవుతుంది. రిస్క్ లేకుండా నీళ్ళు, సాగు నీళ్ళు, రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు వస్తున్నాయి. మరి రిస్క్ తీసుకొని వేరే ప్రభుత్వానికి ఓటు వేయడం ఎందుకు పండిన పంట ఏ తంటా లేకుండా ఊరూరా కాంట పెట్టీ కొనుగోలు చేసస్తున్నారు. కర్ణాటక సీఎం ధన్యవాదాలు చెప్పాలి. కర్ణాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నట్లు ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అని చెప్పి ఇప్పుడు మాట మార్చాడు. నేను అనలేదు అని బుకాయిస్తున్నడు. అన్న మాట, వీడియో అందరూ చూశారు. కుల్లం కుల్లం అన్నవు. గూగుల్ చేసి చూడు రేవంత్ రెడ్డి. 5 గంటలు కావాలి అనేవాళ్ళు కాంగ్రెస్ కు, 24 గంటల కరెంట్ కావాలనుకునేవాళ్లు బిఆర్ఎస్ కు ఓటు వేస్తరు. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే మేలు ఎలా జరుగుతుందో, కెసిఆర్ చేతిలో తెలంగాణ ఉంటే అలా మేలు జరుగుతుంది. సురక్షితంగా ఉంటుంది.
చెన్నూరు నియోజకవర్గం సమస్యలు పరిష్కారం కావాలన్నా బి ఆర్ఎస్ ఎమ్మెల్యే నియంతృత్వ పాలన నుండి ప్రజలు విముక్తు కావాలంటే బహుజన సమాజ్ పార్టీని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థి దాసారపు శ్రీనివాస్ బుధవారం బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందమర్రి కి ఆశీర్వాద సభ కు విచ్చేసిన కెసిఆర్ ఈ చెన్నూరు నియోజకవర్గం ఏమి హామీ ఇవ్వలేదు సింగరేణి కార్మికుల సమస్యలు ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే బీఎస్పీ పార్టీతోటే సాధ్యమైతుందని ప్రజలు తమ ఓటును ఏనుగు గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు.స్థానికేతరుడైన చెన్నూరు ఎమ్మెల్యే ఒక నియంతగా రాజుగా పాలన సాగిస్తూ ఇసుక మాఫియా భూదాన్దా చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వందల కోట్లు సంపాదించుకున్నాడు తప్ప నియోజకవర్గానికి ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గడ్డం సోదరులు వారి స్వార్ధ ప్రయోజనాలకు ఆస్తులను కాపాడుకోవడానికి తప్ప ప్రజలకు కార్మికులకు చేసింది ఏమీ లేదని వారు సూచించారు. సింగరేణి కరెంటును బొగ్గును దోచుకుని కొన్ని వేలకోట్ల రూపాయలు పడ్డాయని బీఎస్పీ పార్టీ అధికారంలోకి వచ్చాక జైలుకు పంపించి అబకాయిలను వసూలు చేస్తామని తెలిపారు. లబ్బర్ చెప్పులతో వచ్చి ఎంపీగా ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి కొన్ని వేల కోట్లు సంపాదించావని నీ యొక్క పూర్వ పరిస్థితి ఏంటనేది ఉస్మానియా యూనివర్సిటీ తెలుపుతుందని యూనివర్సిటీ నాయకునిగా పనిచేసిన నీవు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టే పరిస్థితి నీకు లేదని అన్నారు. 2018 ఎన్నికలలో చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన నిన్ను ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న గడ్డం వివేక్ ని గెలిచినచో తన వ్యాపారాలనే చూసుకుంటూ ప్రజల సమస్యలు పట్టించుకోడని అలాంటి వ్యక్తిని గెలిపించుకొని ప్రజలు ఇబ్బంది పడొద్దు అని తెలిపారు. బిఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ప్రజల సేవ నిమిత్తం ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బీఎస్పీ లో చేరాడని అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో బిఎస్పి అభ్యర్థిని గెలిపించిన ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన చెన్నూరు నియోజవర్గం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని బహుజన పార్టీని గెలిపించుకున్నచో ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తీరుస్తూరని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గుణ.జిల్లా ఇంఛార్జి జాగిరి రాజేష్, ఉపాధ్యక్షుడు సందీప్ రెడ్డి, విజయ్, జోనల్ మహిళా కన్వీనర్లు అర్చన, భవానీ, జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డు వినోద, మాంతయ్య, సారయ్య, రాజు ఇతర చెన్నూరు నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గుర్క జైపాల్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారి శ్రీను నాయక్ కు దాఖలు చేశారు. అంతకుముందు కర్మన్ ఘట్ లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కల్వకుర్తిలోని అమరవీరుల స్తూపానికి తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ గారు నన్ను ఆశీర్వదించి కల్వకుర్తి నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ మరియు బి ఫామ్ అందజేయడం జరిగిందని. ఆయన ప్రవేశపెట్టిన పథకాలే నన్ను గెలిపిస్తాయని కుల మతాలకు అతీతంగా కారు గుర్తు మీద ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పలువురు బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్వో కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తో కలిసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే సతీష్ కుమార్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతకుముందు స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నామినేషన్ పత్రాలతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సమయంలో అక్కడే ఉన్న హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తో కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఆర్వో కార్యాలయానికి తరలి వెళ్లారు. ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ 2014 కు ముందు ఉన్న పరిస్థితి, ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని, మార్పును ప్రజలు గమనించాలన్నారు.
ఒకప్పుడు కరువు కాటకాలతో మెట్ట ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ లో ఇప్పుడు భూగర్భ జలాలు పెరిగి సంతోషంగా, సుభిక్షంగా రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, తనను కూడా మూడో సారి గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణం సిద్ధమయ్యింది. సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలోని.. అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. బీఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి అభ్యర్డులు సభలకు సర్వం సిద్ధం చేశారు. గత నాలుగు రోజుల నుంచి సభల ఏర్పాట్లు చేస్తుండగా.. సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. పోలీసు యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాట్లు చేసింది.
టికెట్లు అమ్ముకునే సంస్కృతి ఉన్న కాంగ్రెస్పార్టీ రేపు రాష్ట్రాన్ని అమ్ముకోదన్న గ్యారంటీ ఏంటని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఆందోల్ మండల పరిధిలోని సంగుపేట వద్ద జరిగిన బూత్ కమిటీల సమావేశానికి హాజరై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్తో కలిసి మాట్లాడారు. కాంగ్రెసోళ్లకు ప్రజలు పదకొండు సార్లు అవకాశమిస్తే ఏం డెవలప్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంగారెడ్డిని జిల్లా చేయలేదు, తలాపున ఉన్న సింగూర్ నుంచి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థులన్నారు. ఆందోల్ కాంగ్రెస్ పెద్ద లీడర్ వాళ్లకు, వీళ్లకు టికెట్ ఇప్పిస్తానని మాటిచ్చి ఇప్పుడు భంగపడ్డారని విమర్శించారు. తెలంగాణ సాధించి అభివృద్ధి వైపు నడిపిస్తున్న కేసీఆర్ను వదులుకుంటే తెలంగాణ ప్రజలు ఆగమవుతారన్నారు. కేసీఆర్ను గెలిపించుకుటేనే భవిష్యత్ ఉంటుందన్నారు. తల్లి లాంటి బీఆర్ఎస్ను ప్రజల నుంచి దూరం చేయడానికి కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు. కార్యకర్తలు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి సీఎంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారని ఆకాంక్షించారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నేడు వివేకానంద నగర్ లోని తన నివాసం నుండి నామినేషన్ వేయడానికి ర్యాలీగా బయలుదేరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేరిలింగంపల్లిలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.




Total views : 89929