జనగామ జిల్లా కేంద్రంలోని 13 వ వార్డు లో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించడం జరిగింది… ప్రచారంలో భాగంగా బీడీలు చుట్టి గడప గడప తిరుగుతూ ఓటర్స్ తో ముచ్చటించారు.. జనగామ పట్టణం ఇప్పటికే బాగా అభివృద్ది అయింది ఇంకా బాగా కావాల్సిన అవసరం ఉన్నది జిల్లా అయిన తరవాత చుట్టుపక్కల ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు కాబట్టి వాళ్ల అందరికి విద్యా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది చేసే పనులు చేస్తున్నాం అని చెప్తున్నాం చేయలేని పనిలు కాదు అని వివరిస్తున్న జనగాం పట్టణములో చాలామంది పేదలకి ఇళ్లు లేని వారికీ కచ్చితంగా గృహలక్ష్మి ఇస్తాం అని మాట ఇచ్చిన జనగాం సమగ్ర అభివృద్ధిలో భాగంగా పేదలకు ఇళ్లు ఇస్తాం ఎవరికైతే పెన్షన్ రాలేదో ఒకటే నెలలో పెన్షన్ ఇస్తాం కేసిఆర్ కొత్తగ ప్రవేశ పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో గృహ లక్ష్మి, పెన్షన్ పెంపు, గ్యాస్ ధర 400 పథకాలు ప్రచారం చేస్తున్నాం..
Kcr
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయనికి 10ఎకరాల స్థలం కేటాయించడం పై హర్షం వ్యక్తం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైసరి కమిటీ వైస్ ఛైర్మన్ మెట్టు రాఘవేంద్ర అభినందనీయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వాయిసరి కమీటీ వైస్ చైర్మన్ గా నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి లకు మెట్టు. రాఘవేంద్ర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హైద్రాబాద్ గోషామహల్ లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అన్ని ఆలయాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అందులో భాగంగా తెలంగాణ, కరీంనగర్ లో కేసీఆర్ ప్రకటించిన 10ఎకరాల భూమి లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణానికి 20కోట్లు కేటాయించారని గుర్తు చేశారు.అన్నివర్గాల మతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం అభినందనీయం అని రాఘవేంద్రా పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఓడించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర – బీసీ డిక్లరేషన్ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ అందరికీ నా నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. రేవంత్ రెడ్డి రెండుచోట్ల ఘన విజయం సాధిస్తారన్నారు. కేసీఆర్ తన అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ను ఓడించాలని నిర్ణయించుకున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని ఆ పార్టీ నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కువ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, ఈ నెల 30వ తేదీన ఓటు వేసేందుకు ప్రజలు వేచి చూస్తున్నారన్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన డీకే శివకుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్తాయిలో విమర్శలు చేసారు.ఇప్పటి వరకు సచివాలయానికి వెళ్ళని కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపిచలని అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ రహస్య దోస్తులని, బీజేపీ నేతలు హైదరాబాద్కు వచ్చి మాత్రమే కేసీఆర్పై విమర్శలు చేస్తారన్నారు.కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ వంటివి అరవై ఏళ్లు దాటినా చెక్కు చెదరలేదని,కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే బీటలు వారిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోయిందన్నారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తెలంగాణ తలరాతను ఈ ఎన్నికల్లో మార్చబోతున్నారని, డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేసారు.
సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఓడించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర – బీసీ డిక్లరేషన్ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ అందరికీ నా నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. రేవంత్ రెడ్డి రెండుచోట్ల ఘన విజయం సాధిస్తారన్నారు. కేసీఆర్ తన అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ను ఓడించాలని నిర్ణయించుకున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని ఆ పార్టీ నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కువ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, ఈ నెల 30వ తేదీన ఓటు వేసేందుకు ప్రజలు వేచి చూస్తున్నారన్నారు.
Read Also..
Read Also..
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మల్లారం బొల్లేపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో పాల్గొని గడపగడప తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లారం బొల్లెపల్లి గ్రామాల నుండి BRS పార్టీకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 15 నుండి 20 సీట్లు కూడా రావని అక్కస్సుతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లకు దింపుడు కాలం దగ్గరికి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలని సంకల్పంతో ప్రజలు ఉన్నారని ఉద్యోగ వ్యాపార సంఘాలు రైతులు ప్రజలు తమకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికలలో తనను నకిరేకల్ గడ్డపై అత్యధిక మెజారిటి తో గెలిపించాలని ప్రజలను కోరారు.
Read Also..
Read Also..
శేర్లింగంపల్లిలోని చందానగర్ డివిజన్ లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం వలన ప్రజల మన్ననలు పొందామన్నారు.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తొమ్మిది వేల కోట్ల రూపాయల తో అభివృద్ధి పనులు జరిగాయని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయని వాటిని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నామన్నారు… బూటకపు మాటలతో బురద చల్లే పార్టీ లను ప్రజలు తిరస్కరించిండానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. శేరిలింగంపల్లి లో గులాబీ జెండా ఎగుర బోతుందని, హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా కేసీఆర్ రికార్డు కొట్టబోతున్నారని ఉద్ఘాటించారు.
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గనికి భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నామినేషన్ వేయడానికి వచ్చారు మునుగోడు మండలం పులిపలుపుల గ్రామానికి చెందిన కంభంపాటి సత్యనారాయణ. తెలంగాణ వస్తే 92 వెయిల ఉద్యోగాలు ఇస్తానన్న చెప్పిన కేసీఆర్10 సంవత్సరాలు గడిసిన నోటిఫికేషన్ వెయ్యకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఇంటికో పింఛన్ ఇస్తున్నానని చెప్తున్న కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎందుకు చెప్పట్లేడని ప్రశ్నించారు. ఇంటికి క్వాటర్ బీర్లు పంపుతూ తాగుబోతుల తెలంగాణ చేసిండని,కేసీఆర్ కి ఓటు వేస్తే నిరుద్యోగులు బిక్షం ఎత్తుకుని పరిస్థితి వచ్చిందని, రైతులు కూడా బిక్షం ఎత్తుకొక తప్పదన్నారు.తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసినం కానీ కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుండని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ని రాజకీయ నిరుద్యోగి చేయడమే తమ లక్ష్యం పంతమన్నారు. నేలపై పడుకుని సాష్టాంగ నమస్కారం చేస్తూ కేసీఆర్ కు ఓటు వేయొద్దని వేడుకున్నారు.
పాలకుర్తి గడ్డకు ఒక చరిత్ర ఉంది.. పోరాట పటిమ ఉంది..మిమ్మల్ని చూస్తుంటే దొరల కడ్డీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది
అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. పాలకుర్తి కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ
ఒకనాడు డీలర్ గా ఉన్న దయాకర్ రావు దందాలు చేసి ఇప్పుడు డాలర్ దయాకర్ రావు అయిండన్నారు.. ఝాన్సీ రెడ్డి కుటుంబం పేదలకు సేవలు చేశారు.మీకు సేవచేసేందుకు కాలేజీలు, ఆసుపత్రుల కోసం 80 ఎకరాల భూమి కొంటే దయాకర్ రావు లిటిగేషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టిండన్నారు. రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణను అమ్ముకుంటాడని కేసీఆర్ అంటున్నాడు .. 2009లో సికింద్రాబాద్ ఎంపీ సీట్లు కేసీఆర్ అమ్ముకున్నాడన్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించండి…ఈ ఎన్నికలు కేసీఆర్ నలుగురు కుటుంబ సభ్యులకు… నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని దొరల తెలంగాణ కావాలో, ప్రజల తెలంగాణ కావాలో నిర్ణయించుకోండి అని అన్నారు.
దవ సారి నామినేషన్ దాఖలు చేశాను. రాజకీయంగా జన్మనిచ్చి విదేశాల్లో గుర్తింపు నిచ్చింది. సిరిసిల్ల ప్రజల ప్రజా ప్రతినిదిగా చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను. 15 ఏండ్ల గా అవినీతి రహితంగా పని చేసినం సిరిసిల్ల ముఖ చిత్రం మార్చిన పల్లెలు పచ్చ బడ్డాయి. వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న మీ బిడ్డగా రాష్ట్ర స్థాయి లో గౌరవం పెరిగింది. అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నాను. గౌరవ ప్రదమైన మెజారిటీతో గెలిపిస్తారాని నమ్ముతున్నగులాబి దండు నాకు అండగా ఉంది. ఇంటింటికి ప్రగతి నివేదిక పంపుతున్న 55 ఎండ్లు అధికారం. ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్ కు ఓటు వేస్తారు. సంక్షేమం అభివృద్ధి చేసిన నన్ను గెలిపిస్తారా ఒకే ఒక గొంతుకను అనిచి వేయాలని రాహుల్ గాంధీ వస్తున్నాడు మనకు. మనకు ఏమన్న ఉంటే మనం మనం పరిష్కరించు కుందం ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకనాటి సామంత రాజ్యంగా కావాలా కరెంటు కావాలా. కాంగ్రెస్ కావాలా నీళ్ళు కావాలా.. కన్నీళ్లు కావాలా.. స్కాములు కావాలా సబ్బండ వర్ణాల అభ్యున్నతికి బి ఆర్ ఎస్కు ల మత పిచ్చి గాల్లను గెలిపిద్దమ్మ ఆలోచించండి. జిల్లా తెచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం నేతన్నల తలరాతలు మార్చాం ప్రలోబాలకు లొంగీ పతే ఆగం ఐతం గతంలో తప్పు చేస్తే మళ్ళీ 50 ఎండ్లు బడపడ వలసి వస్తది మళ్ళీ డిల్లీ మొచేతు నీళ్ళు తాగే పరిస్తితి వస్తది. సిరిసిల్ల ప్రజలు చైతన్య వంతమైన ప్రజలు సిరిసిల్ల ప్రజల కోసం పనిచేసిన నన్ను మళ్ళీ భారీ మెజారిటీతో గేలిపిస్తారని విశ్వాసం ఉంది.






Total views : 90594