నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మల్లారం బొల్లేపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో పాల్గొని గడపగడప తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లారం బొల్లెపల్లి గ్రామాల నుండి BRS పార్టీకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 15 నుండి 20 సీట్లు కూడా రావని అక్కస్సుతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లకు దింపుడు కాలం దగ్గరికి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలని సంకల్పంతో ప్రజలు ఉన్నారని ఉద్యోగ వ్యాపార సంఘాలు రైతులు ప్రజలు తమకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికలలో తనను నకిరేకల్ గడ్డపై అత్యధిక మెజారిటి తో గెలిపించాలని ప్రజలను కోరారు.
Read Also..
Read Also..





Total views : 147469