Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Telangana టికెట్లు అమ్ముకున్నోళ్లు.. రాష్ట్రాన్ని అమ్ముకోరా..!

టికెట్లు అమ్ముకున్నోళ్లు.. రాష్ట్రాన్ని అమ్ముకోరా..!

by Satya
Minister Harish Rao

టికెట్లు అమ్ముకునే సంస్కృతి ఉన్న కాంగ్రెస్​పార్టీ రేపు రాష్ట్రాన్ని అమ్ముకోదన్న గ్యారంటీ ఏంటని మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు. ఆందోల్ మండల పరిధిలోని సంగుపేట వద్ద జరిగిన బూత్​ కమిటీల సమావేశానికి హాజరై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​తో కలిసి మాట్లాడారు. కాంగ్రెసోళ్లకు ప్రజలు పదకొండు సార్లు అవకాశమిస్తే ఏం డెవలప్​ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంగారెడ్డిని జిల్లా చేయలేదు, తలాపున ఉన్న సింగూర్​ నుంచి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థులన్నారు. ఆందోల్​ కాంగ్రెస్​ పెద్ద లీడర్​ వాళ్లకు, వీళ్లకు టికెట్ ​ఇప్పిస్తానని మాటిచ్చి ఇప్పుడు భంగపడ్డారని విమర్శించారు. తెలంగాణ సాధించి అభివృద్ధి వైపు నడిపిస్తున్న కేసీఆర్​ను వదులుకుంటే తెలంగాణ ప్రజలు ఆగమవుతారన్నారు. కేసీఆర్​ను గెలిపించుకుటేనే భవిష్యత్​ ఉంటుందన్నారు. తల్లి లాంటి బీఆర్ఎస్​ను ప్రజల నుంచి దూరం చేయడానికి కాంగ్రెస్​, బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు. కార్యకర్తలు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

009371
Total views : 62087

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.